డబ్బింగ్ మొదలుపెట్టిన 'ఏంజెల్'

  • IndiaGlitz, [Thursday,March 09 2017]

బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ టైటిల్ రోల్ లో తెరకెక్కుతోన్న సినిమా “ఏంజిల్”. యంగ్ హీరో నాగ అన్వేష్, ఓ ఛాలెజింగ్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంతో దర్శకధీరుడు రాజమౌళి శిష్యుడు బాహుబలి పళని దర్శకుడిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. ఒక పాట మినహా ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకొంది. ఈ నేపథ్యంలో నిర్మాత భువన్ సాగర్ మాట్లాడుతూ డబ్బింగ్ వర్క్ దాదాపుగా కంప్లీట్ అయిందని త్వరలో మిగతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి మే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.

గతేడాది శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ లో విడుదలైన సూపర్ హిట్ మూవీ "మన్యంపులి" తరహాలోనే 30 నిమషాలకు పైగా గ్రాఫిక్స్ హంగులతో "ఏంజెల్" రూపుదిద్దుకుంటోంది. భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సుమన్,సప్తగిరి, ప్రదీప్ రావత్, షియాజీ షిండే, కబీర్ సింగ్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్, రామరాజు, ఛమ్మక్ చంద్ర, సన తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి స్టంట్స్ జాషువా ఫైట్ మాస్టర్, కాగా ప్రముఖ బాలీవుడ్ స్టంట్ మాస్టర్ రవివర్మ పతాక సన్నివేశాల ను ప్రత్యేకంగా రూపొందించారు.

బెంగాల్ టైగర్ ఫేమ్ భీమ్స్ సెస్సరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్ అందించగా టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ అండ్ జానీ మాస్టర్లు వినూత్నమైన నృత్యాలు కంపోజ్ చేశారని, కోలీవుడ్ ఫేమ్ గుణ డి.ఎఫ్.టి చిత్రీకరించిన విజువల్స్ అద్బుతమని ఈ చిత్ర బృందం తెలిపింది. భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత శ్రీ సింధూరపువ్వు కృష్ణారెడ్డి పర్యవేక్షణలో సోషియోఫాంటసీ ఎంటర్ టైనర్ గా ఏంజెల్ మే నెలలో ప్రేక్షకులను కనువిందు చేయబోతుంది.

More News

'పిచ్చిగా నచ్చావ్' ట్రైలర్ ఆవిష్కరణ

''ప్రేమన్నది యూనివర్సెల్. కానీ ప్రేమలో ఉన్న ప్రతి మనిషి తనదైన శైలిలో నిర్వచనం చెబుతుంటారు. అంటే ప్రేమ అన్నది వ్యక్తిగతం కూడా. చిన్న విషయాన్ని కూడా అర్ధం చేసుకోకుండా నేటి యువత కోపం, ఈర్ష్య, ద్వేషం పెంచుకుపోతున్నారు.

కిట్టుగాడి విజయ యాత్ర

వరుస విజయాలతో సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్న యువ కథానాయకుడు రాజ్ తరుణ్ హీరోగా, అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్గా ఏటీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వంశీకృష్ణ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర దర్శకత్వంలో రూపొందించిన హిలేరియస్ ఎంటర్టైనర్ `కిట్టు ఉన్నాడు జాగ్రత్త`.

జాహ్నవి ఫిలింస్ బ్యానర్ లో అల్లరి నరేష్ కొత్త చిత్రం

మలయాళం లో ఘన విజయం సాధించిన 'ఓరు వడక్కన్ సెల్ఫీ' చిత్రం అల్లరి నరేష్ హీరోగా తెలుగులో రీమేక్ కాబోతుంది. జాహ్నవి ఫిలింస్ బ్యానర్పై శ్రీమతి నీలిమ సమర్పణలో చంద్రశేఖర్ బొప్పన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. 'ఓరు వడక్కన్ సెల్ఫీ' మలయాళ మాతృక చిత్రాన్ని డైరెక్ట్ చేసిన జి. ప్రజీత్ ఈ రీమేక్కి దర్శకత్వం వహించనున్నారు.

రాజశేఖర్ కుమార్తెను పరిచయం చేయనున్న దర్శకుడు

చిత్రం, జయం, నువ్వు నేను వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు తేజ ఇప్పుడు రానా, కాజల్ హీరో హీరోయిన్లుగా ఓ పొలిటికల్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం ప్రారంభం

బాలకృష్ణ, పూరి జగన్నాథ్ అంటేనే క్రేజీ కాంబినేషన్. హీరోయిజంను డిఫరెంట్ స్టయిల్లో ప్రెజెంట్ చేసే దర్శకుడు పూరి, వంద చిత్రాలతో తెలుగు సినిమా రంగంలో తండ్రికి తగ్గ తనయుడుగా రాణిస్తున్న నటసింహ నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో సినిమా గురువారం ఉదయం ప్రారంభమైంది.