సందీప్ తో అందాల రాక్షసి...

  • IndiaGlitz, [Thursday,February 11 2016]

సందీప్‌కిష‌న్ ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నాడు. నిత్యామీన‌న్‌తో క‌లిసి ఒక్క అమ్మాయి త‌ప్ప' సినిమా, మ‌రో సినిమాగా మల‌యాళ నేరం' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కాకుండా త‌మిళంలో ఓ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను త‌మిళ నిర్మాత సి.వి.కుమార్ ద‌ర్శ‌క‌త్వం చేయ‌బోతున్నాడు.

ఈ సినిమాలో ముందుగా తాప్సీని హీరోయిన్‌గా అనుకున్నారు. అయితే తాప్సీ డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌లేక‌పోవ‌డంతో తాప్సీ స్థానంలో లావ‌ణ్య త్రిపాఠిని హీరోయిన్‌గా తీసుకున్నారు. గ‌తంలో బ్ర‌హ్మాన్' అనే త‌మిళ సినిమాలో న‌టించిన లావ‌ణ్య చాలా గ్యాప్ త‌ర్వాత చేస్తున్న త‌మ‌ళ సినిమా ఇదే కావ‌డం విశేషం. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, సోగ్గాడే చిన్ని నాయ‌నా వ‌రుస విజ‌యాలు అందుకున్న లావ‌ణ్య‌కు ఈ చిత్రం త‌మిళంలో ఎలాంటి బ్రేక్ తెస్తుందో చూడాలి.

More News

తూచ్..అంటున్న సమంత...

హీరోయిన్ సమంత ఇప్పుడు తెలుగు,తమిళ చిత్రాలతో బిజీగా ఉంది.

సుప్రీమ్ సినిమాలో అల్లు హీరో..

మెగాస్టార్ మేనల్లుడు సాయిథరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం సుప్రీమ్.ఈ చిత్రాన్ని పటాస్ ఫేం అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.

పవన్ , మహేష్ ఒకేరోజు రిలీజ్ చేస్తున్నారు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్ధార్ గబ్బర్ సింగ్ చేస్తున్నారు.బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.సూపర్ స్టార్ మహేష్ బ్రహ్మోత్సవం సినిమా చేస్తున్నారు.

మరో రీమేక్ లో వెంకీ....

విక్టరీ వెంకటేష్ గ్యాప్ తీసుకుని సినిమాలు వరుస బెట్టి చేస్తున్నాడు.ఇప్పటికే మారుతి దర్శకత్వంలో బాబూ బంగారం సినిమాను విడుదలకు రెడీ చేస్తున్నారు.

ఫిభ్రవరి 26న విడుదలవుతున్న 'రాజుగారింట్లో 7వరోజు'

భరత్‌ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై అజయ్‌ ప్రధానపాత్రలో భరత్‌, అర్జున్‌, వెంకటేష్‌, అక్షయ్‌, సుష్మిత నటీనటులుగారూపొందిన చిత్రం'రాజుగారింట్లో 7వ రోజు'. ఫిరోజ్‌ రాజ దర్శకత్వంలో భరత్‌కుమార్‌ పీలం ఈ చిత్రాన్నినిర్మించారు.