స‌మంత పాత్ర‌ని మించేలా అన‌సూయ పాత్ర‌

  • IndiaGlitz, [Tuesday,March 27 2018]

రామ్ చరణ్, సమంత నాయకానాయికలుగా తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. అనసూయ, ఆది, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో సంద‌డి చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే.. తొలుత ఈ సినిమాలో అనసూయ పాత్ర కోసం ‘కుమారి 21ఎఫ్’ హీరోయిన్ హెబ్బా పటేల్‌ను సంప్రదించిందంట చిత్ర బృందం. కొన్ని కారణాల వలన ఆమె ఈ అవ‌కాశం వదులుకోవడంతో అనసూయను ఎంపిక చేశారు. ముందు అనసూయ కూడా నిరాకరించినా.. కథ పూర్తిగా విన్న తర్వాత ఓకే చెప్పారని సమాచారం.

అంతేకాదు.. ఈ సినిమాలో కథానాయిక పాత్ర పోషించిన సమంత పాత్ర‌తో సమానంగా అనసూయ పాత్ర ఉంటుందని చిత్ర వర్గాలు వెల్లడిస్తున్నాయి. రంగమ్మగా అనసూయ పాత్ర సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని.. సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్తుందని స‌మాచారం. కొన్ని చోట్ల రామలక్ష్మి (చిత్రంలో సమంత పాత్ర పేరు)ని డామినేట్ చేస్తూ ఈ పాత్ర సాగుతుందని కూడా పేర్కొంటున్నాయి. అంటే.. ఈ నెల 30 తర్వాత (చిత్రం విడుదల తేదీ) మ‌రిన్ని మంచి పాత్రలు అనసూయను వెతుక్కుంటూ వస్తాయన‌డంలో ఎటువంటి సందేహం లేద‌న్న మాట‌.

More News

మ‌రికొంత ఆలస్యం కానున్న 'అమర్ అక్బర్ ఆంటోనీ'

రవితేజ, మాళవిక శర్మ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘నేల టిక్కెట్టు’.

వెంకీ, వ‌రుణ్ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడిగా..

విక్ట‌రీ వెంకటేష్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకులుగా తెరకెక్క‌నున్న‌ మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్2- ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’.

బెల్లంకొండ శ్రీ‌నివాస్ చిత్రంలో న‌వ‌దీప్‌?

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్‌లుగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

 ‘ఎం.ఎల్.ఎ’ సక్సెస్‌తో గ‌ర్వంగా ఫీల‌వుతున్నాం -నిర్మాత‌లు

నందమూరి కల్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘ఎం.ఎల్.ఎ` టి.జి.విశ్వప్రసాద్ సవుర్పణలో

'అభిమన్యుడు' లో 'యాంగ్రి బర్డ్‌లాంటి నన్నె తను లవ్‌ చేసెలేరా'.. పాట విడుదల

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో