ఖిలాడిలో 'చంద్రకళ'గా సిగ్గుపడుతోన్న అనసూయ.. ఎంత పద్ధతిగా వుందో..!!

  • IndiaGlitz, [Friday,February 04 2022]

టీవీ షోలు, ఈవెంట్స్‌తో పాటు సినిమాల్లోనూ ఛాన్స్‌లు దక్కించుకుని దూసుకెళ్తున్నారు స్టార్ యాంకర్ అనసూయ. యాంకరింగ్‌తో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు సుకుమార్ లైఫ్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. రంగస్థలంలో రంగమ్మత్తగా కనిపించి నటిగా ఓ మెట్టుపైకెక్కిన అనసూయ.. ఇటీవల పుష్పలో అంతకుమించి అనిపించారు. ఈ చిత్రంలో దాక్షాయణిగా నెగిటివ్ షేడ్ వున్న పాత్ర పోషించి భయపెట్టారు అనసూయ. అమ్మోరు లాంటి పెద్ద బొట్టు, చేతికి ఉంగరాలు, మెడలో నగలు ధరించి రౌద్రంగా కనిపించారు. ఫాహద్ ఫజిల్, సునీల్ లాంటి వారు విలన్లుగా వున్నా.. అనసూయ తన మార్క్ చూపించారు. పుష్ప' పార్ట్ 2లో ఆమె పాత్ర హైలైట్ గా నిలుస్తుందని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఖిలాడి' సినిమాలోనూ అనసూయ ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఆమె చంద్రకళ అనే పాత్ర పోషిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్రయూనిట్ శుక్రవారం విడుదల చేసింది. చీర కట్టుకొని, సిగ్గుపడుతూ.. ముఖంపై చిరునవ్వులు చిందిస్తూ చాలా పద్ధతిగా కనిపిస్తున్నారు అనసూయ. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే ‘‘ఖిలాడీ’’లో అనసూయ పాత్ర గురించి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె డ్యూయల్ రోల్ పోషిస్తోందని.. హీరోయిన్ తల్లి క్యారెక్టర్‌లో, హీరోకి అత్తగా కనిపిస్తుందని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇవాళ్టీ పోస్టర్‌లో అనసూయ గెటప్ చూస్తుంటే.. తల్లి క్యారెక్టర్‌లా అనిపించడం లేదు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

ఇకపోతే 'ఖిలాడి' సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. కోనేరు సత్యనారాయణ, హవీష్ నిర్మించిన ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. వీర సినిమా తర్వాత రమేశ్ వర్మ - రవితేజ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలు వున్నాయి. ఫిబ్రవరి 11న ఖిలాడి ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

More News

చావుకు భయపడను.. ‘‘జడ్’’ కేటగిరీ భద్రతను తిరస్కరించిన అసదుద్దీన్ ఒవైసీ

కేంద్ర ప్రభుత్వం తనకు కేటాయించిన జడ్‌ కేటగిరీ భద్రతను ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తిరస్కరించారు. తనకు జడ్‌ కేటగిరీ భద్రత అక్కర్లేదన్న ఆయన. అందరిలాగే తాను

'మనసు కోరితే... తగ్గేదే లే'.. అల్లు అర్జున్ జోమాటో యాడ్ చూశారా..?

పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా పుష్ప పాటలు, డైలాగులతో హోరెత్తుతోంది.

'డిజె టిల్లు' చూస్తే నవ్వులతో పాండమిక్ ఒత్తిడి అంతా మర్చిపోతారు - హీరోయిన్ నేహా శెట్టి

అన్ని వర్గాల ప్రేక్షకులను 'డిజె టిల్లు' సినిమా ఆకట్టుకుంటుందని చెబుతోంది యువ తార నేహా శెట్టి. ఆమె రాధిక పాత్రలో నటించిన 'డిజె టిల్లు' ఈనెల 12న థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది.

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి ‘‘Z’’ కేటగిరీ భద్రత... కేంద్రం కీలక నిర్ణయం

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన భద్రతకు సంబంధించి

రాజశేఖర్ బర్త్ డే.. ఫ్యాన్స్‌కి ట్రీట్: 'శేఖర్' నుంచి కిన్నెర సాంగ్ విడుదల

కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చవి చూసి.. ముఖంపై చెరగని చిరునవ్వుతో అందరి అభిమానాలను చొరగొంటున్నారు యాంగ్రీ యంగ్‌మెన్ డాక్టర్ రాజశేఖర్. మూడున్నర దశాబ్ధాలకు