ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ గా అనసూయ

  • IndiaGlitz, [Tuesday,January 23 2018]

డా. మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న గాయత్రి చిత్రం ఫిబ్రవరి 9 న విడుదల కానుంది. సంక్రాంతికి విడుదలైన టీజర్ కు అద్భుతమైన స్పందన రాగా, 'రాయలసీమ రామన్న చౌదరి' తరహాలో మోహన్ బాబు ఓ పవర్ఫుల్ రోల్ లో కనిపించనుండటంతో చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి.

విష్ణు మంచు, శ్రియలు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. వారి లుక్స్ కి కూడా విశేష స్పందన వచ్చింది. తాజాగా అనసూయ పాత్ర పరిచయ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. అనసూయ శ్రేష్ఠ జయరాం అనే ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ గా కనిపించనున్నారు. పోస్టర్ పై ఆమె తీక్షణ చూపులు పాత్రపై ఆసక్తి రేపుతోంది.

కథలో ప్రాధాన్యత ఉండే పాత్ర అని తెలుస్తోంది. నిఖిల విమల్, బ్రహ్మానందం ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్రవరి 9 న మన ముందుకు రాబోతున్న గాయత్రీ చిత్రాన్ని డా.యమ్.మోహన్ బాబు తన ప్రతిష్టాత్మక బ్యానర్ అయిన శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పై నిర్మించగా అరియానా, వివియానా మరియు విద్యా నిర్వాణ సమర్పిస్తున్నారు.

More News

బన్ని సినిమా ముందుకా? వెనక్కా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ వేసవిలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు.

అడివిశేష్ , శివాని జంటగా ఫిబ్రవరిలో కొత్త చిత్రం ప్రారంభం

లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై అడివి శేష్ హీరోగా ఓ కొత్త చిత్రం షూటింగ్ ఫిబ్రవరిలో

నిఖిల్ 'కిరాక్ పార్టీ' తొలి పాట‌... విడుద‌ల‌

వ‌రుస విజ‌యాల‌తో, వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో దూసుకుపోతున్న యువ క‌థానాయ‌కుడు నిఖిల్ న‌టిస్తున్న 15వ చిత్రం 'కిరాక్ పార్టీ'.  ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. సిమ్ర‌న్ ప‌ర్జీనా, సంయుక్త హెగ్డే క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఏ టీవీ స‌మ‌ర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై  రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర

సాయిధరమ్ తేజ్ 'ఇంటిలిజెంట్' ఫస్ట్ లుక్

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా సి.కె.ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై

బాలయ్య సినిమాతోనే దక్కింది

‘పురియాదా పుదిర్’(1990)చిత్రంతో తమిళ ఇండస్ట్రీలో దర్శకుడిగా అడుగుపెట్టారు కె.ఎస్.రవికుమార్..