హీరోయిన్ క‌న్‌ఫ‌ర్మ్ చేసేసింది

  • IndiaGlitz, [Saturday,July 16 2016]

ఉయ్యాలా జంపాలా నుండి ఈడోర‌కం ఆడోర‌కం వర‌కు వ‌రుస విజయాలు సాధించిన యంగ్ హీరో రాజ్ త‌రుణ్ త్వ‌ర‌లోనే హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు మారుతి చిత్రంలో న‌టించబోతున్నాడు. అయితే ఈ చిత్రానికి మారుతి క‌థ‌, స్క్రీన్‌ప్లేను అందిస్తున్నాడ‌ట‌. ఈ చిత్రాన్ని సంజ‌నారెడ్డి అనే లేడీ డైరెక్ట‌ర్ తెర‌కెక్కిస్తుంది. ఈ చిత్రంలో న‌టకిరిటీ రాజేంద్ర‌ప్ర‌సాద్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా అమైరా ద‌స్త‌ర్ పేరుని ప‌రిశీలిస్తున్నార‌ని గ‌తంలో తెలియ‌జేశాం. ఇప్పుడు హీరోయిన్ అమైరా ద‌స్త‌ర్ ఈ విష‌యాన్ని క‌న్‌ఫ‌ర్మ్ చేసింది.

రాజ్ త‌రుణ్ నా కంటే ఓ సంవ‌త్స‌రం మాత్ర‌మే పెద్ద. మంచి కోస్టార్‌. నేను గతేడాదినే తెలుగులో పూరిజ‌గ‌న్నాథ్‌గారి సినిమాతో పాటు మంచు విష్ణు సినిమాలో న‌టించాల్సింది కానీ హాలీవుడ్ సినిమా కుంగ్‌ఫూ యోగ చిత్రంలో అవ‌కాశం రావ‌డంతో అటు వైపే మొగ్గు చూపాను. ఎలాగైతేనేం ఇప్పుడు తెలుగులో న‌టించే అవ‌కాశం రావ‌డం హ్యాపీగా ఉంది, అలాగే నేను అమ‌ల అక్కినేనిగారికి పెద్ద ఫ్యాన్‌ని, శివ సినిమాలో ఆమెను చూడ‌గానే ఆమెకు పెద్ద అభిమానిగా మారిపోయానంటూ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది.