ట్రెండ్ క్రియేట్ చేస్తున్న అమితాబ్ లుక్

  • IndiaGlitz, [Tuesday,September 18 2018]

బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ న‌టిస్తున్న చిత్రం 'థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్‌'. విజ‌య్ కృష్ణ ఆచార్య ద‌ర్శ‌కుడు. యశ్‌రాజ్ ఫిలింస్ ప‌తాకంపై ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ 8న విడుద‌ల చేస్తున్నారు.

క‌త్రినా కైఫ్‌, స‌నా ఫాతిమా షేక్, రోనాల్ రాయ్ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 27న ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేశారు. రీసెంట్‌గా సినిమా లోగోను విడుద‌ల చేసిన యూనిట్ ఈరోజు అమితాబ్ లుక్‌ను విడుద‌ల చేసింది.

క్షుద్ర‌బ‌క్ష్ పాత్ర‌ధారిగా అమితాబ్ లుక్ ప్ర‌స్తుతం ట్రెండింగ్‌లో ఉంది. 1839 కాలం నాటి నవల ‘కన్ఫెషన్స్‌ ఆఫ్ థగ్’ ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అజ‌య్‌, అతుల్ ఈ చిత్రానికి సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు.

More News

బ్రేక‌ప్‌పై ర‌ష్మిక స్పంద‌న‌..

న‌టుడు ర‌క్షిత్‌తో నిశ్చితార్థం జ‌రిగిన త‌ర్వాత హీరోయిన్‌గా బిజీ అయిపోవ‌డం .. ఇత‌ర కార‌ణాల‌తో ఎంగేజ్‌మెంట్ బ్రేక‌ప్ అయింది.

నెట్‌ఫ్లిక్స్ సిరీస్ శివ‌గామి ఎవ‌రంటే?

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన 'బాహుబ‌లి' చిత్రంలో రాజ‌మాత శివ‌గామిగా ర‌మ్య‌కృష్ణ న‌ట‌న అందరి మ‌న్న‌న‌లు అందుకుంది.

'నోటా' వివాదం...

విజ‌య్ దేవ‌ర‌కొండ, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం 'నోటా'. తెలుగు, త‌మిళంలో నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా నిర్మాత‌.

త‌మిళ అర్జున్ రెడ్డి షూటింగ్ పూర్తి

తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సందీప్‌రెడ్డి వంగా కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. తెలుగులో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది.

ప‌రువుహ‌త్య‌పై స్పందించిన హీరో మంచు మ‌నోజ్..

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ప‌రువు హ‌త్యపై హీరో మంచు మ‌నోజ్ స్పందించారు. కులం పేరుతో ప్ర‌ణ‌య్ ను అతి దారుణంగా చంపిన సంగ‌తి తెలిసిందే.