బాంబు లాంటి ధరతో కొత్త ఫ్లాట్ కొన్న అమితాబ్.. నైబర్ గా సన్నీలియాన్

బిగ్ బి అమితాబ్ గురించి వస్తున్న వార్త ఒకటి ఆశ్చర్యం కలిగించేలా ఉంది. అమితాబ్ చూడని డబ్బు, ఆస్తులు ఉండవు. ఇండియాలోనే ప్రఖ్యాత నటుడాయన. తాజాగా అమితాబ్ ముంబైలో ఓ ఖరీదైన భవంతిని కొన్నారట. అమితాబ్ కొన్న ప్రాపర్టీ ధర కళ్ళు చెదిరే విధంగా ఉంది. ఈ ప్రాపర్టీ కోసం అమితాబ్ రూ 31 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం అమితాబ్ ఈ ప్రాపర్టీని గత ఏడాది డిసెంబర్ లోనే కొనుగోలు చేశారట. కానీ దాని రిజిస్ట్రేషన్ ప్రకియ ఇటీవలే పూర్తయినట్లు తెలుస్తోంది. ఆ ప్రాపర్టీ ధర 31 కోట్లు కాబట్టి అన్ని విలాసవంతమైన హంగులు ఉన్నాయట. కారు పార్కింగ్ కోసం ఆరు స్లాట్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: చిత్ర పరిశ్రమపై ఇలియానా ఘాటు వ్యాఖ్యలు

క్రిస్టల్ గ్రూప్ అనే టైర్ 2 బిల్డర్స్ చేస్తున్న అట్లాంటిస్ అనే ప్రాజెక్ట్ లోనిది ఈ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ 5,184 చదరపు అడుగుల వైశాల్యంలో ఈ ప్రాపర్టీ ఉన్నట్లు తెలుస్తోంది. అమితాబ్ కు ముంబైలో ఇప్పటికే నాలుగు బంగ్లాలు ఉన్నాయి. ప్రతీక్ష, జనక్, విస్తా, జల్సా అనే బంగ్లాలు అమితాబ్ కు చెందినవి.

ప్రస్తుతం అమితాబ్ తన భార్య, కొడుకు అభిషేక్, ఐశ్వర్య, ఆద్య లతో కలసి జల్సా బంగ్లాలో నివసిస్తున్నారు. అమితాబ్ కొత్తగా కొన్న ప్రాపర్టీలో మరో విశేషం ఉంది. అదే ప్రాజెక్టులో శృంగార తార సన్నీలియోన్ రూ. 16 కోట్లతో ప్రాపర్టీ కొనిందట. అంటే అమితాబ్,సన్నీలియోన్ నైబర్స్ అని అంటున్నారు.

More News

ఆక్సిజన్‌ను తరలిస్తున్న గూడ్స్ రైలులో మంటలు

ప్రస్తుత తరుణంలో ఆక్సిజన్ అవసరం ఎంతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆక్సిజన్ కొరత కారణంగా రోజుకు ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

ఆనందయ్య విషయమై కేఏ పాల్ కీలక ప్రకటన

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్యకు రోజురోజుకూ ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతోంది. సామాన్యుల నుంచి అనూహ్య మద్దతు పొందిన ఆయన ప్రస్తుతం ప్రముఖుల మద్దతును సైతం పొందుతున్నారు.

చిత్ర పరిశ్రమపై ఇలియానా ఘాటు వ్యాఖ్యలు

నడుము సుందరి ఇలియానా గతంలో టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. పోకిరి తర్వాత కుర్రకారంతా ఇలియానా జపం చేశారు. కెరీర్ బాగానే సాగుతున్న టైంలో ఇలియానా రాంగ్ స్టెప్ వేసింది.

మరింత ప్రియం కానున్న దేశీయ విమాన ప్రయాణం

దేశీయ విమాన ప్రయాణం మరింత ప్రియం కానుంది. విమానయాన ఛార్జీల దిగువ పరిమితిని జూన్‌ 1 నుంచి 13 - 16 శాతం పెంచుతూ శుక్రవారం పౌరవిమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది.

నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే డాక్టర్ దంపతుల హత్య

నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారుని అడ్డగించి డాక్టర్ దంపతులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపిన ఘటన రాజస్థాన్‌లో కలకలం రేపుతోంది.