మహేష్ మ‌ల్టీప్లెక్స్‌లో అమితాబ్-ఆమిర్ సినిమా!

  • IndiaGlitz, [Sunday,October 28 2018]

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు థియేటర్ బిజినెస్‌లోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఏషియన్ సినిమాస్ భాస్వామ్యంతో హైదరాబాద్ గచ్చిబౌలిలో మహేష్ ప్రారంభించిన మ‌ల్టీప్లెక్స్‌ నిర్మాణం పూర్తయ్యింది.

ఈ మ‌ల్టీప్లెక్స్‌కి 'వి.జె' అని పేరు పెట్టినట్టు తెలుస్తుంది. దీపావళి సందర్భంగా నవంబర్ 8న దీనిని ఓపెన్ చేయనున్నారు. హిందీ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ హీరోలుగా నటించిన 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' సినిమాతో మహేష్ మల్టీప్లెక్స్ ఓపెన్ కానుంది.

భాగ్య నగరంలోని మహేష్ అభిమానులు తమ హీరో సినిమా ఎప్పుడు విడుదలవుతుందా? తమ హీరో థియేటర్లో ఎప్పుడు ఆ సినిమాను చూద్దామా? అని ఎదురు చూస్తున్నారు.

దీపావళికి మహేష్ సినిమా ఏదీ విడుదల కాకపోవడంతో వారు కొంచెం నిరాశ పడుతున్నారు. మహేష్ సినిమా విడుదల అయితే... మహేష్ మ‌ల్టీప్లెక్స్‌లో ఆ సినిమా చూస్తే... ఎంతో సంతోషంగా ఉండేదని అభిమానులు అనుకుంటున్నారు.

More News

అల్లువారింట అట్లతద్ది!

తెలుగులో స్టయిలిష్ స్టార్ ఎవరు? అని అడిగితే ఎవరైనా అల్లు అర్జున్ పేరే చెబుతారు! స్టయిల్‌కి అల్లు అర్జున్ కేరాఫ్ అడ్రస్ అన్నట్టు ఉంటారు.

విజయ్ దేవరకొండకు హిందీ హీరో కాంప్లిమెంట్‌!

'అర్జున్‌రెడ్డి' అంటే విజయ్ దేవరకొండ... విజయ్ దేవరకొండ అంటే 'అర్జున్‌రెడ్డి' అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

చంద్రోదయం చిత్రీకరణ పూర్తి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బయోపిక్ గా తెరకెక్కుతొన్న చిత్రం 'చంద్రోదయం'. ఈ బయోపిక్ ను పి.వెంకటరమణ దర్శకత్వంలొ జి.జె.రాజేంద్ర నిర్మిస్తున్నారు.

టెంపర్‌ రీమేక్‌ చేయడానికి కారణమదే: విశాల్‌

'పందెంకోడి' చిత్రంతో తమిళ్‌, తెలుగు ప్రేక్షకుల్లో మాస్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం 'పందెంకోడి-2'.

ప్ర‌జ‌ల త‌ర‌పున రాజకీయ అస్ర్తం ఆప‌రేష‌న్ 2019

అలివేల‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్పించు  టి. అలివేలు నిర్మించిన క‌ర‌ణం బాబ్జీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ఆప‌రేష‌న్ 2019. శ్రీ‌కాంత్‌, మంచుమ‌నోజ్ న‌టిస్తున్న ఈ చిత్రం న‌వంబ‌ర్ 9న