అల్లు శిరీష్, వి.ఐ.ఆనంద్, ఒక్క క్షణం ఫస్ట్ లుక్

  • IndiaGlitz, [Wednesday,November 29 2017]

శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ త‌ర్వాత అల్లు శిరీష్ హీరోగా, సురభి, సీరత్ కపూర్ హీరోయిన్లుగా, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి టెర్రిఫిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అందించిన చిత్ర ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చక్రి చిగురుపాటి నిర్మించిన చిత్రం ఒక్క క్షణం.

ఇటీవలే విడుదల చేసిన టైటిల్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఒక్క క్షణం డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.... అల్లు శిరీష్ హీరోగా మా బ్యానర్ లో నిర్మిస్తున్న చిత్రం ఒక్క క్షణం. ఇటీవలే విడుదల చేసిన టైటిల్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు హీరో హీరోయిన్ తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశాం. విడుదల చేసిన కొద్ది గంటల్లోనే... పోస్టర్ గురించి సోషల్ మీడియాలో హలచల్ జరుగుతోంది. ఇంతగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఒక్క క్షణం చిత్ర ప్రమోషన్ ను సైతం వినూత్న రీతిలో ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే భారీ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నాం.

ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిసెంబర్ లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. శ్రీరస్తు శుభమస్తు వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత అల్లు శిరీష్ నటిస్తున్న చిత్రం కావడం, ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అల్లు శిరీష్ , సుర‌భి, అవ‌స‌రాల శ్రీనివాస్‌, సీర‌త్ క‌పూర్ లు కొత్త పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుంటారు. అబ్బూరి రవి, ఛోటా కె ప్రసాద్, శ్యామ్ కె నాయుడు వంటి సీనియర్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. సతీష్ వేగేశ్న, రాజేష్ దండ సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అని అన్నారు.

More News

'మేరా భార‌త్ మ‌హాన్‌' షూటింగ్ ప్రారంభం!

ప్ర‌థ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై భ‌ర‌త్ ద‌ర్శ‌క‌త్వంలో డా.శ్రీధ‌ర్ రాజు ఎర్ర, డా.తాళ్ల ర‌వి, డా. టిపిఆర్ తొలిసారిగా నిర్మిస్తోన్న చిత్రం `మేరా భార‌త్ మ‌హాన్‌`. అఖిల్ కార్తిక్, ప్రియాంక శ‌ర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

'బిచ్చ‌గాడు' సినిమా న‌చ్చిన ప్రేక్ష‌కుల‌కు 'ఇంద్ర‌సేన' త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది - విజ‌య్ ఆంటోని

విజయ్‌ ఆంటోని, డయానా చంపిక, మహిమ, జ్యువెల్‌ మేరీ తారాగణంగా రూపొందిన చిత్రం 'ఇంద్రసేన'. జి.శ్రీనివాసన్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్‌.కె.ఆర్‌.ఫిలింస్‌ బేనర్‌పై నీలం కృష్ణారెడ్డి విడుదల చేస్తున్నారు.

నిఖిల్ 15 అప్ డేట్స్

మంచి కథల్ని ఎన్నుకుని సినిమాలు చేసే యువ కథానాయకుల్లో నిఖిల్ ముందుంటారు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో.. కన్నడలో సూపర్ హిట్ చిత్రంగా పేరుతెచ్చుకున్న ‘కిరిక్ పార్టీ’ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాతో తన కెరీర్ లో 15 సినిమాలను పూర్తిచేస్తున్నారు నిఖిల్.

పవన్ రీమేక్ కన్ ఫర్మ్ అయినట్టే

తెలుగులో రీమేక్ కథలంటే ఇష్టపడే హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయన కెరీర్లో చేసిన రీమేక్ సినిమాలన్నీ దాదాపు హిట్ అనే చెప్పాలి.

జనవరిలో రానున్న 'రంగస్థలం' ఫస్ట్ లుక్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘రంగస్థలం 1985’. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటిస్తోంది. యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను సమకూరుస్తున్నారు.