6 కోట్లకు అల్లు శిరీష్ ఒక్క క్షణం ఆంధ్రా హక్కులు

  • IndiaGlitz, [Tuesday,November 28 2017]

శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ త‌ర్వాత అల్లు శిరీష్ హీరోగా, సురభి, సీరత్ కపూర్ హీరోయిన్లుగా, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి టెర్రిఫిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అందించిన చిత్ర ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్ డైరెక్షన్ లో లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రం ఒక్క క్షణం.

ఇప్ప‌టికే దాదాపు షూటింగ్ పూర్త‌యిన ఈ చిత్రం డిసెంబర్ 23 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. కాగా... ఈ చిత్ర బిజినెస్ భారీస్థాయిలో జరుగుతోంది. తాజాగా ఒక్క క్షణం ఆంధ్రా హక్కుల్ని దాదాపు 6 కోట్లకు కాశీ విశ్వనాథం దక్కించుకున్నారు. ఈయన గతంలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన రవితేజ నటించిన కృష్ణ చిత్రాన్ని నిర్మించారు. సినిమాలు నిర్మించడంతో పాటు పబ్లిక్ పల్స్ తెలిసిన నిర్మాత కావడంతో ఒక్క క్షణం ఆంధ్రా హక్కుల్ని దక్కించుకున్నారు.

హీరో, దర్శకుడు, నిర్మాతల మీదున్న నమ్మకంతో పాటు... సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయం అనే టాక్ రావడంతో ఆంధ్రా హక్కుల్ని భారీగా చెల్లించి దక్కించుకున్నారు. ఆంధ్రాతో పాటు... ఇతర ఏరియాలకు సైతం మంచి పోటీ నెలకొంది. హీరో, డైరెక్టర్ వర్క్ చేసిన గత సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలవడంతో ఒక్క క్షణం చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో చిత్ర బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతోంది. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా నిర్మాణం జరుగుతోంది.

ద‌ర్శ‌కుడి స్టైల్లో వుంటూనే.. హీరో శిరీష్ ని చాలా కొత్త‌గా మెగాభిమానుల్ని ఆక‌ట్టుకునేలా ఈ చిత్రం వుంటుంది. డిసెంబ‌ర్ 23న విడుద‌ల‌వుతున్న ఈ చిత్రం ఇంటెలిజెంట్ ఆడియెన్స్ నుంచి సామాన్య ప్రేక్ష‌కుల వ‌ర‌కూ అంద‌ర్ని ఆక‌ట్టుకుంటుంది. అల్లు శిరీష్ , సుర‌భి, అవ‌స‌రాల శ్రీనివాస్‌, సీర‌త్ క‌పూర్ లు కొత్త పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుంటారు. అబ్బూరి రవి, ఛోటా కె ప్రసాద్, శ్యామ్ కె నాయిడు వంటి సీనియర్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. సతీష్ వేగేశ్న, రాజేష్ దండ సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

More News

పవన్ ని ఆకాశానికెత్తేసిన కీర్తి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’. ఈ సినిమా టైటిల్ ని చిత్ర యూనిట్ నిన్న కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ వారణాసిలో ఆఖరి షెడ్యూల్ జరుపుకుంటోంది.

ప్రాజెక్ట్ z.. అడ్డంకులు తొలగిపోయాయి

సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న తమిళ చిత్రం ‘మాయవన్’. ఇదొక సైన్స్ ఫిక్షన్ క్రైమ్ మిస్టరీ ఫిలిం. దీనిని ‘ప్రాజెక్ట్ z’ అనే పేరుతో తెలుగులో డబ్ చేస్తున్నారు.

అన్నయ్యని డైరెక్ట్ చేస్తానంటున్న తమ్ముడు

ఆవారా, నాపేరు శివ, ఊపిరి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన తమిళ కథానాయకుడు కార్తి. ‘ఖాకి’ సినిమా విజయంతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు ఈ యువ కథానాయకుడు.

గ‌రుడ‌వేగ ఆర్టిస్ట్‌.. షార్ట్ ఫిల్మ్‌

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టైలిష్ విలన్ గా పేరు తెచ్చుకున్నాడు యువ న‌టుడు ఆదర్శ్ బాలకృష్ణ.యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్'లో రన్నర్ అప్ గా నిలిచాడు ఆద‌ర్శ్‌.

నాని 'ఎం సి ఎ' విడుదల తేదీ

డబుల్ హ్యాట్రిక్ హీరో.. నేచురల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు కాంబినేషన్లో రూపొందుతోన్నసినిమా 'ఎం.సి.ఎ'. దిల్రాజు 'ఫిదా' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు భానుమతిగా పరిచయమైన సాయిపల్లవి ఎం.సి.ఎలో హీరోయిన్గా నటించింది.