బ‌న్ని బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు

  • IndiaGlitz, [Monday,November 27 2017]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ నా పేరు సూర్య'. ర‌చ‌యిత వక్కంతం వంశీ మొదటిసారిగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. నాగేంద్రబాబు సమర్పణలో లగడపాటి శిరీషా శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. సినిమా బాగా రావ‌డం కోసం బ‌న్ని చాలా క‌ష్ట‌ప‌డుతున్నార‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

ద‌ర్శ‌కుడు వ‌క్కంతం వంశీ కూడా ఈ విష‌యం గురించి మాట్లాడుతూ, "కొత్త డైరెక్ట‌ర్ నైనా నాకు అల్లు అర్జున్ ఇస్తున్న సహాయ సహకారాలకు నేనెప్పుడూ రుణపడి ఉంటాను. అల్లు అర్జున్ ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. ఆయ‌న క‌ష్టం చూస్తే మాకు మ‌రింత స్ఫూర్తిగా అనిపిస్తోంది", అని తెలిపారు.

బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ విశాల్ శేఖర్ లు ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. గతంలో వెంకటేష్ నటించిన 'చింతకాయల రవి' సినిమాకి కూడా ఈ ఇద్ద‌రు సంగీత ద‌ర్శ‌కులే మ్యూజిక్ ని అందించారు. ఈ సినిమా సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 27న థియేటర్లలో సందడి చేయ‌నుంది.