అల్లు అర్జున్‌కు కరోనా పాజిటివ్

  • IndiaGlitz, [Wednesday,April 28 2021]

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభణ కొనసాగిస్తోంది. రోజుకు రెండున్నర లక్షలకు పైగా కేసులు నమోదవుతూ ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖ రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్, పూజా హెగ్డే, బండ్ల గణేష్, అల్లు అరవింద్ తదితరులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని బన్నీ స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించాడు.

ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నానని బన్నీ తెలిపాడు. రీసెంట్‌గా తనను కాంటాక్ట్ అయిన వారందరూ టెస్ట్ చేయించుకోవాలని బన్నీ తెలిపాడు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని.. ఆందోళన చెందవద్దని అభిమానులకు తెలిపాడు. ‘‘హాయ్ ఎవ్రీ వన్. నాకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నేను ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నాను అలాగే ప్రోటోకాల్స్ అన్నీ పాటిస్తున్నాను. ఇటీవలి కాలంలో నన్ను కలిసిన వారంతా వెళ్లి టెస్ట్ చేయించుకోండి. ఇంట్లోనే ఉండండి, సేఫ్‌గా ఉండండి. అవకాశం వచ్చిన వెంటనే వ్యాక్సిన్ వేయించుకోండి. నా వెల్ విషర్స్, అభిమానులు ఆందోళన చెందవద్దు. నేను బాగానే ఉన్నాను’’ అని అల్లు అర్జున్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

More News

దిల్ రాజుకు పవన్ మళ్లీ గ్రీన్ సిగ్నల్.. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని ఏ దర్శక నిర్మాతకు ఉండదు? నిర్మాత దిల్ రాజుకైతే పవన్‌తో సినిమా చేసేందుకు చాలా కాలమే పట్టింది.

మే 3 వరకూ అమెరికా వీసాలకు బ్రేక్..

కరోనా మహమ్మారి తెలంగాణలో విజృంభిస్తోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.

ఇండియా తనకు రెండో ఇల్లు అంటూ బ్రెట్‌లీ భారీ విరాళం

భారత్‌లో కరోనా మహమ్మారి అలజడి సృష్టిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది.

కోవిడ్‌పై సమరానికి సిద్ధమైన ఏపీ.. జగన్ కీలక ఆదేశాలు..

కోవిడ్‌పై సమరానికి ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

యాంకర్ శ్యామల భర్తపై చీటింగ్ కేసు

ప్రముఖ యాంకర్, బిగ్‌బాస్ ఫేం శ్యామల భర్త నర్సింహారెడ్డిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది.