బ‌న్నీ త‌దుప‌రి సినిమా ఆ ద‌ర్శ‌కుడితోనేనా?

  • IndiaGlitz, [Thursday,April 16 2020]

బ‌న్నీ త‌దుప‌రి సినిమాల‌ను భారీ ప్లాన్‌తోనే విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప‌పై చాలా కేర్ తీసుకుంటున్నారు. క‌రోనా ఎఫెక్ట్ లేకుంటే ఈపాటికి పుష్ప సెట్స్‌పై ఉండాల్సింది. కానీ కుద‌ర‌లేదు. స‌రే! లాక్‌డౌన్ అయిన త‌ర్వాత సినిమాను వీలైనంత త‌ర్వ‌గానే పూర్తి చేస్తారు. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేసేలానే అనిపిస్తుంది. ఈ ప‌క్క త‌న 20వ సినిమా గురించి ఆలోచిస్తున్న బ‌న్నీ తదుప‌రి సినిమాను స్టార్ డైరెక్ట‌ర్‌తోనే చేయ‌బోతున్నాడ‌ట‌. ఆ ద‌ర్శ‌కుడెవ‌కో కాదు... సందీప్ వంగా అని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

వివ‌రాల్లోకెళ్తే.. తొలి చిత్రం ‘అర్జున‌రెడ్డి’తో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను స్టార్ హీరోగా మార్చిన సందీప్ వంగా త‌దుప‌రి సినిమాను మ‌హేశ్‌తో చేయాల‌నుకున్నాడు కానీ కుద‌ర‌లేదు. ఆలోపు బాలీవుడ్‌లోనే అర్జున్ రెడ్డిని క‌బీర్ సింగ్ పేరుతో సినిమాను రీమేక్ చేసి బాలీవుడ్‌లోనూ భారీ హిట్ కొట్టాడు. మ‌ళ్లీ టాలీవుడ్ హీరోల‌తో సినిమాలు చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న సందీప్ వంగాను ఎవ‌రూ పట్టించుకోలేదు. చివ‌ర‌కు బ‌న్నీతో సందీప్ సినిమా ఉంటుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అయితే బ‌న్నీఇప్పుడు చేస్తున్న పుష్ప త‌ర్వాత ఇప్ప‌టికే దిల్‌రాజు బ్యాన‌ర్‌లో ఐకాన్ సినిమా పూర్తి చేయాల్సి ఉంది. మ‌రి అప్ప‌టి వ‌ర‌కు సందీప్ వంగా వెయిట్ చేస్తాడా? అనేది ఆలోచించాల్సిన విష‌యం.

 

More News

ప‌వ‌న్‌తో ఇల్లీ బేబీ! ఓకే అయిన‌ట్లేనా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ టైటిల్ పాత్ర‌లో శ్రీరామ్ వేణు ద‌ర్శ‌కుడిగా రూపొందుతోన్న చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. బోనీకపూర్ సమర్పణలో బే వ్యూ ప్రాజెక్ట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకాలపై

క‌రోనా వైర‌స్‌పై మ‌రో సినిమా ..

ట్రెండ్‌కు త‌గ్గ‌ట్టు సినిమాల‌ను నిర్మించ‌డం మ‌న మేక‌ర్స్‌కు అల‌వాటు. ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా మ‌హ‌మ్మారిని పార‌దోల‌డానికి అంద‌రూ క‌ష్ట‌ప‌డుతున్నారు.

జర్నలిస్టుల తొలగింపుపై ముంబై ప్రెస్ క్లబ్ తీవ్ర ఆగ్రహం

కరోనా సంక్షోభం నేపథ్యంలో ఉద్యోగులను తొలగించొద్దని.. వారి జీతాల్లో కోత తగదని సాక్షాత్తు ప్రధాని మోదీ బహిరంగంగా ప్రకటించారు. అయితే కొన్ని మీడియా సంస్థల

జగన్‌ను నేను ఆ మాట అన్లేదు.. బెదిరిస్తున్నారు : రాయపాటి

‘కమ్మ వారు ఏం చేస్తారులే అనుకోవద్దని.. కమ్మవారు తలుచుకుంటే జగన్ లేచిపోతాడు’ అని ఏపీ సీఎంపై టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసులు.. వాట్ నెక్స్ట్!?

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. అగ్రరాజ్యం అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీలో పరిస్థితి అల్లకల్లోల్లంగా ఉంది. ఇండియాలో అంత లేదు కానీ.. పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం