బ‌న్ని కొత్త అవ‌తారం

  • IndiaGlitz, [Monday,December 18 2017]

క‌థానాయ‌కుడుగా అల్లు అర్జున్ స్థాయి ఏమిటో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న బ‌న్ని.. ప్ర‌స్తుతం నా పేరు సూర్య సినిమా చేస్తున్నారు. ర‌చ‌యిత వక్కంతం వంశీ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేస్తున్నారు. కాగా, మ‌రో నూత‌న ద‌ర్శ‌కుడికి కూడా బ‌న్ని అవ‌కాశ‌మిస్తున్నార‌ని టాలీవుడ్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

అయితే ఈ సారి హీరోగా కాదు.. నిర్మాత‌గా. త‌న తండ్రి అల్లు అర‌వింద్ గీతా ఆర్ట్స్ ప‌తాకంపై సినిమాల‌ను నిర్మిస్తున్న‌ప్ప‌టికీ.. రామ్ చ‌ర‌ణ్ లాగా త‌ను కూడా నిర్మాత‌గా మారి సినిమాల‌ను నిర్మించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట బ‌న్ని.

బాక్సింగ్ నేప‌థ్యంలో సాగే ఓ క‌థ‌తో అను కె.రెడ్డి ఓ స్క్రిప్ట్‌ని బ‌న్నికి చెప్పార‌ని.. ఆ క‌థ త‌న‌కి ఎంత‌గానో న‌చ్చ‌డంతో తానే నిర్మాత‌గా మారి ఈ చిత్రాన్ని చేసేందుకు ముందుకు వ‌చ్చార‌ట ఈ మెగా ఫ్యామిలీ క‌థానాయ‌కుడు. ఏప్రిల్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంద‌ని తెలిసింది. హీరోగా నిరూపించుకున్న బ‌న్ని.. నిర్మాత‌గానూ స‌క్సెస్ అవుతారేమో చూడాలి.

More News

నాని కూడా చేరుతాడా?

దిల్ రాజు.. స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన ప్రొడ్యూస‌ర్ పేరిది. కొత్త ద‌ర్శ‌కుల‌తో ఎక్కువ విజ‌యాల‌ను అందుకున్న వైనం రాజు సొంతం. ఇదిలా ఉంటే.. దిల్ రాజు ఈ సంవ‌త్స‌రం ఏకంగా ఆరు చిత్రాల‌ను నిర్మించి వార్త‌ల్లోకెక్కారు.

జనవరిలో విడుదలకు సిద్ధమైన 'శరభ'

ఏ.కె.ఎస్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై ఆకాష్ కుమార్ ను హీరోగా పరిచయం చేస్తూ ఎన్.నరసింహారావు తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ థ్రిల్లర్ 'శరభ'.

చ‌రణ్‌తో బాలీవుడ్ న‌టుడు...

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా జ‌న‌వ‌రి నుండి బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

గుండు హ‌నుమంతురావు, పొట్టి వీర‌య్య‌ల‌కు చిరంజీవి 4ల‌క్ష‌లు ఆర్ధిక‌ స‌హాయం

క‌మెడియ‌న్ గుండు హ‌నుమంతురావు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధప‌డుతోన్న నేప‌థ్యంలో టెలివిజ‌న్ లో ప్ర‌సార‌మ‌య్యే 'అలీతో జాలీ'గా షో ద్వారా గుండు ఆరోగ్య ప‌రిస్థితిని తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి 2ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్ ను  'మా' మూవీ ఆర్టిస్ట్  అసోసియేష‌న్ అధ్య‌క్షుడు శివాజీ రాజా ద్వారా అంద‌జేశారు.

జో పాత్ర మెప్పిస్తుందంటున్న సురభి

ఉషాకిరణ్ మూవీస్ వారి బీరువా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఢిల్లీ సుందరి సురభి.