ఆగ‌స్టు నుంచి బ‌న్నీ చిత్రం?

  • IndiaGlitz, [Tuesday,July 03 2018]

వైవిధ్య‌భ‌రిత‌మైన సినిమాలలో నటించడమే కాదు.. పాత్ర‌కు తగ్గట్టుగా తనని తాను మార్చుకునే హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. తాజాగా విడుదలైన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'లో ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించడం కోసం నిజంగా ఆర్మీ ఆఫీసర్‌లు ఎటువంటి శిక్షణ పొందుతారో.. అటువంటి శిక్షణతో పాటు వారి లాగే దేహధారుడ్యాన్ని కూడా మ‌లచుకున్నారు ఈ స్టైలిష్ స్టార్.

రైటర్ నుంచి దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ త‌న‌ తొలి ప్రయత్నంగా తెరకెక్కించిన ఈ సినిమా ఫ‌లితం సంగ‌తి పక్కన పెడితే.. అల్లు అర్జున్ పాత్రను డిజైన్ చేసిన తీరు బాగుందని పలువురు కొనియాడారు.

ఈ సినిమా త‌రువాత మ‌రో వైవిధ్య‌మైన పాత్ర‌లో క‌నిపించేందుకు బ‌న్నీ సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలిసింది. 'ఇష్క్', 'మనం', '24' లాంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన విక్రమ్ కుమార్‌తో ఓ సినిమా చేయబోతున్నార‌ట బ‌న్ని.

ఈ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వినికిడి. గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మితమవబోయే ఈ చిత్రం.. ఆగస్టు నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన‌ అధికారిక ప్రకటన వెలువడనుంది.

More News

మ‌హేష్ 25 రిలీజ్ డేట్‌..

ఇటీవ‌ల విడుద‌లైన భ‌ర‌త్ అనే నేనుతో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నారు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు. ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేస్తున్నారు.

బాల‌కృష్ణ‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్ చిత్రం

'శ్రీ‌మంతుడు', 'జ‌న‌తా గ్యారేజ్‌', 'రంగ‌స్థ‌లం' తో హ్యాట్రిక్ విజ‌యాల‌ను అందుకున్న సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌. ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రాల‌కు చిరునామాలా నిలిచిన ఈ సంస్థ‌.

దేవ‌నార్ స్కూల్‌లో పుట్టిన‌రోజుని సెల‌బ్రేట్ చేసుకున్న హీరోయిన్ శివానీ రాజ‌శేఖ‌ర్

నా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నా సంతృప్తి కోసం నేను, నా త‌ల్లిదండ్రులు క‌లిసి మ‌న భూమి కోసం తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టిన హ‌రిత హారం కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం ఆనందంగా ఉంది.

సత్యదేవ్ - నందితాశ్వేత కాంబినేషన్ లో 'బ్లఫ్ మాస్టర్'

ఆశ, అత్యాశ‌ల నేపథ్యంలో రూపొందిన  'చ‌తురంగ వేట్టై' చిత్రానికి  త‌మిళ  ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఇప్పుడీ చిత్రం తెలుగులో రీమేక్ అయ్యింది .

డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణితో తరుణ్ భాస్కర్

డైరెక్టర్ తరుణ్ భాస్కర్ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణిని ముంబాయిలో కలిశారు. ఈ నగరానికి ఏమైంది చిత్ర స్పెషల్ షోలో వీరిద్దరూ కలవడం జరిగింది.