ఆక‌ట్టుకుంటున్న బ‌న్ని మెసేజ్‌...

  • IndiaGlitz, [Wednesday,June 06 2018]

ఒక‌ప్పుడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫ్యాన్స్‌కు, బ‌న్ని ఫ్యాన్స్‌కు అస‌లు ప‌డేది కాదు. దాంతో బ‌న్ని సినిమాలకు వ్య‌తిరేకంగా ప‌వ‌న్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేసిన సంద‌ర్భాలూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ప‌రిస్థితి అలా లేదు. ప‌వ‌న్, బ‌న్ని ఇద్ద‌రూ క‌లిసి పోయారు.

బ‌న్ని న‌టించిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాకు సంబంధించిన స‌క్సెస్ మీట్‌కు ప‌వ‌న్ చీఫ్ గెస్ట్‌గా విచ్చేశాడు. అప్ప‌టి నుండి ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు త‌గ్గిపోయాయి. అందుకు ఉదాహ‌ర‌ణంగా అల్లు అర్జున్ ప‌వ‌న్ రాజ‌కీయ పోరాటానికి మ‌ద్ధ‌తునిస్తూ 'మీ నిజ‌మైన త‌త్వంతో బ్ర‌త‌కండి.. ప్ర‌పంచం దానిక‌దే అడ్జ‌స్ట్ అవుతుంది' అంటూ మెసేజ్‌ను త‌న సోష‌ల్ మీడియా వేదిక ద్వారా పోస్ట్ చేశారు. దీంతో వీరి మ‌ధ్య అనుబంధం ఇంకా పెరిగింద‌ని సినీ వ‌ర్గాలంటున్నాయి.