చ‌ర‌ణ్‌తో స్పెష‌ల్ సాంగ్ బ‌న్ని హీరోయిన్‌...

  • IndiaGlitz, [Wednesday,October 04 2017]

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమాలో బ‌న్నితో ఆడి పాడిన పూజా హెగ్డే ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రంలో న‌టిస్తుంది. ఈ సినిమాతో పాటు ఓ స్పెష‌ల్ సాంగ్‌లో చేయ‌నుండ‌టం విశేషం. అది కూడా మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న పూజా ఈ స్పెష‌ల్ బీట్‌లో కాలు క‌దుప‌నుంది.

రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'రంగ‌స్థ‌లం 1985'. స్పెష‌ల్ సాంగ్‌ల‌ను తెర‌కెక్కించ‌డంలో సుకుమార్ దిట్ట‌. త‌న‌దైన స్టైల్‌లో సుకుమార్ తెర‌కెక్కించ‌నున్న స్పెష‌ల్ సాంగ్‌ను ఎవ‌రితో చేయించాల‌ని సుకుమార్ చాలానే ఆలోచించాడ‌ట‌. చివ‌ర‌కు దువ్వాడ‌జ‌గ‌న్నాథ‌మ్‌లో పూజా హెగ్డే డ్యాన్స్ చూసి త‌న‌నే స్పెష‌ల్ సాంగ్ చేయించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు. పూజా కూడా ఈ స్పెష‌ల్ లో చ‌ర‌ణ్‌తో చిందేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిందని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.