అభిమాని కోసం బ‌న్ని ఆవేద‌న‌...

  • IndiaGlitz, [Monday,May 14 2018]

సినిమా హీరోల‌కు అభిమానులే కొండంత బ‌లం. ఈ అభిమానుల్లో కొంద‌రు వీరాభిమానులు కూడా ఉంటారు. కొన్ని సంద‌ర్భాల్లో హీరోల‌కు ఈ వీరాభిమానుల‌తో ప్ర‌త్యేకానుబంధం కూడా ఉంటుంది. అలాంటి అభిమానే మాటూరు దేవ‌సాయి గ‌ణేశ్‌. ఇత‌ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి వీరాభిమాని.

త‌ను బోన్ క్యాన్స‌ర్‌తో ఇబ్బంది ప‌డుతున్న సంద‌ర్భంలో బ‌న్ని అత‌న్ని ప్ర‌త్యేకంగా క‌లిసి ప‌రామ‌ర్శించాడు కూడా. త‌న ఆరోగ్యం కోసం ప‌ది ల‌క్ష‌లు ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు బన్ని. అయితే ఈ వీరాభిమాని క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారి కార‌ణంగా క‌న్నుమూశాడు.

ఈ విష‌యం తెలిసిన బ‌న్ని త‌న శోకాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. 'దేవ‌సాయి గ‌ణేశ్ క‌న్నుమూశాడ‌నే సంగ‌తి తెలియ‌గానే నా హృద‌యం ప‌గిలినంత ప‌నైంది. అత‌ని ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ‌సానుభూతిని వ్య‌క్తం చేస్తున్నాను' అన్నారు.

More News

లేడీ విల‌న్‌తో మ‌రోసారి వ‌ర్క‌వుట్ అవుతుందా?

13 ఏళ్ల త‌ర్వాత విశాల్ త‌న‌కు బ్రేక్ ఇచ్చిన సినిమా 'పందెం కోడి' (సండైకోళి)కి సీక్వెల్‌ను చేస్తున్నాడు. 'సండైకోళి2' పేరుతో త‌మిళంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

తేజ కోసం బాల‌య్య ప్ర‌య‌త్నాలు...

దివంగ‌త ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు బ‌యోపిక్‌ను 'య‌న్‌.టి.ఆర్‌' పేరుతో తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే.

తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలని ఉంది - శ్రీ దివ్య

'మనసా' చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన అచ్చ తెలుగు అమ్మాయి శ్రీదివ్య. తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినా హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఎ బి టి క్రియేషన్స్ వారి 'వేర్ ఈజ్ ది వెంకట లక్ష్మీ' చిత్ర ప్రారంభోత్సవం...

ఎబిటి క్రియేషన్స్ పతాకంపై మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి సమర్పణలో ఎం శ్రీధర్ రెడ్డి, హెచ్. ఆనంద్ రెడ్డి, ఆర్ కె. రెడ్డి లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం " వేర్ ఈజ్ వెంకట లక్ష్మీ".

న్యూజెర్సీ ప్ర‌భుత్వం నుండి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న న‌ట‌కిరీటి డా.రాజేంద్ర ప్ర‌సాద్‌

41 సినీ ప్ర‌స్థానంలో న‌వ ర‌సాలున్న ఏ పాత్ర‌నైనా అవ‌లీల‌గా పోషించ‌గ‌ల న‌టుడు న‌ట‌కిరీటి డా.రాజేంద్ర‌ప్ర‌సాద్‌. 237 సినిమాల్లో న‌టించిన ఈయ‌న ఎన్నో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో మెప్పించారు.