వావ్.. పౌరాణిక చిత్రంలో అల్లు అర్జున్ కుమార్తె.. ఎంట్రీ అదిరిందిగా!

అల్లు ఫ్యామిలీ నుంచి క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. అల్లు వారి కుటుంబంలో నాలుగోతరం నటులు రెడీ అవుతున్నారు. అల్లు రామలింగయ్య తర్వాత అల్లు అరవింద్.. ఆ తర్వాత అల్లు అర్జున్ సినిమాల్లో కొనసాగుతుండగా ఇప్పుడు అల్లు అర్జున్ ముద్దుల కుమార్తె అల్లు అర్హ టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇవ్వనుంది.

ఈ గుడ్ న్యూస్ ని బన్నీ స్వయంగా సోషల్ మీడియా వేదికగా రివీల్ చేశారు. 'మా అల్లు కుటుంబానికి ఇది ప్రౌడ్ మూమెంట్. నాల్గవ జనరేషన్ అల్లు అర్హ 'శాకుంతలం' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ అద్భుతమైన చిత్రంతో నా కుమార్తెని టాలీవుడ్ లోకి పరిచయం చేస్తున్న గుణశేఖర్ గారికి, నీలిమ గారికి కృతజ్ఞతలు. సమంత, నేను కలసి నటించాం. ఇప్పుడు నా కుమార్తె ఆమె చిత్రంలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. శాకుంతలం టీంకు నా బెస్ట్ విషెష్' అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.

గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్న చిత్రం శాకుంతలం. మహాభారతంలో అత్యంత కీలకమైన దుష్యంతుడు, శకుంతల కథని గుణశేఖర్ విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

శాకుంతలంలో సమంత ప్రధాన పాత్రలో టైటిల్ రోల్ పోషిస్తోంది. శకుంతల తనయుడే భరతుడు. అల్లు అర్హ ఈ చిత్రంలో చిన్ననాటి భరతుడి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్హ తన క్యూట్ క్యూట్ అల్లరితో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏకంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఆసక్తిగా మారింది.

ఇక గుణశేఖర్ కి, అల్లు అర్జున్ కి ప్రత్యేక అనుబంధం ఉంది. వరుడు, రుద్రమదేవి చిత్రాలు గుణశేఖర్ దర్శత్వంలోనే తెరకెక్కాయి. రుద్రమదేవిలో బన్నీ నటించిన గోనగన్నారెడ్డి పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

More News

4 గంటలపాటు విచారణ..కత్తి మహేష్ స్నేహితుడు చెప్పిన విషయాలేంటి ?

కత్తి మహేష్ రోడ్డు ప్రమాదం, మృతి కేసులో పోలీసులు విచారణని వేగవంతం చేశారు.

గ్రాండ్ లాంచ్ కి రెడీ అవుతున్న ఛత్రపతి రీమేక్.. ఈ విశేషాలు తెలుసా!

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ డెబ్యూకి రెడీ అవుతున్నాడు. ఛత్రపతి రీమేక్ లో శ్రీనివాస్ బాలీవుడ్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే.

Roar Of RRR: అంచనాలు తారాస్థాయికి.. మతిపోగొడుతున్న వీడియో!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ పై అంచనాలు ఒక్కసారిగా తారాస్థాయికి చేరాయి.

పవన్, రానా మూవీ నుంచి సినిమాటోగ్రాఫర్ అవుట్.. ఏమైంది?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్ర షూటింగ్ ఇటీవల హైదరాబాద్ లో తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే.

హైకోర్టులో విజయశాంతికి షాక్.. ప్రభుత్వ భూముల వివాదం!

లేడి సూపర్ స్టార్, బిజెపి నేత విజయశాంతికి హైకోర్టులో షాక్ తగిలింది.