అప్పుడు.. ఇప్పుడు బన్నీ!!

  • IndiaGlitz, [Friday,April 17 2020]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప‌’. భారీ బ‌డ్జెట్‌తో తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమా పాన్ ఇండియా చిత్రంగా విడుద‌ల‌వుతుంది. పాన్ ఇండియా సినిమాగా సినిమాను ఆవిష్క‌రించ‌డానికి సుకుమార్ అండ్ టీమ్ బాగానే క‌ష్ట‌ప‌డుతున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో న‌టీన‌టుల‌ను ఇందులోకి తీసుకొస్తున్నాడ‌ట. చిత్తూరు జిల్లా శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సినిమా తెర‌కెక్క‌నుంది. రీసెంట్‌గా బ‌న్నీ పుట్టిన‌రోజున అనౌన్స్ చేసిన‌ ఈ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్‌కు మంచి స్పందన వ‌చ్చింది.

ఈ సినిమా కోసం బ‌న్నీ చిత్తూరుజిల్లా యాస‌ను ప్ర‌త్యేకంగా నేర్చుకున్నాడు. కాగా ఇప్పుడు ర‌ష్మిక మంద‌న్న వంతు వ‌చ్చింది. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఉన్న స‌మ‌యాన్ని ర‌ష్మిక సినిమా కోసం స‌ద్వినియోగం చేసుకుంటోంద‌ట‌. అందులో భాగంగా ర‌ష్మిక చిత్తూరు జిల్లా యాస‌ను నేర్చ‌కుంటుంద‌ని స‌మాచారం. ఏమైనా సందేహాలుంటే చిత్ర యూనిట్‌ను సంప్ర‌దిస్తుంద‌ట‌. అంటే పుష్ప‌లో బ‌న్నీతో పాటు ర‌ష్మిక కూడా చిత్తూరు యాస‌లో మాట్లాడుతుంద‌న్న‌మాట‌. మైత్రీమూవీస్‌, ముత్యం శెట్టి మీడియా బ్యాన‌ర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంటే ఓ బాలీవుడ్ బ్యూటీ స్పెష‌ల్ సాంగ్‌లో న‌ర్తించ‌నుంద‌ట‌. అలాగే ఓ బాలీవుడ్ న‌టుడిని విల‌న్‌గా న‌టింప చేయాల‌నుకుంటున్నాడ సుక్కు.

More News

ఎన్టీఆర్‌ డ‌బుల్ ట్రీట్ ఇస్తాడా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన‌రోజు మే 20. ఈ రోజున ఎన్టీఆర్ అభిమానులకు డ‌బుల్ ట్రీట్ ఇస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

చిరుతో క‌లిసి న‌టించ‌నున్న స్టైలిష్ స్టార్‌..?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 152వ చిత్రం ‘ఆచార్య‌’ను పూర్తి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీని తర్వాత చిరంజీవి ఎక్కువ గ్యాప్ తీసుకోవాల‌నుకోవ‌డం లేద‌ట‌.

తెలుగు సినీ కార్మికులకు అమితాబ్ అండ

కరోనా ప్రభావంతో ప్రపంచమంతా స్తబ్దుగా మారింది. మన దేశం విషయానికి వస్తే మే 3 వరకు లాక్‌డౌన్‌ను విధించారు. దీంతో సామాన్య ప్ర‌జ‌లు, సెల‌బ్రిటీలు ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు.

ఉపేంద్ర - చంద్రు కాంబినేషన్‌లో 'కబ్జా' ఫస్ట్ లుక్ విడుదల

కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర నటిస్తున్న తాజా సినిమా 'కబ్జా'. శ్రీధర్ లగడపాటి సమర్పణలో శ్రీ సిద్ధేశ్వర ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై ఆర్. చంద్రు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.

కరోనాతో పోల్చితే బిన్ లాడెన్ ఓ బచ్చా: ఆర్జీవీ

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంశంపై అయినా సరే తనదైన శైలిలో విమర్శలు,