మహేశ్‌తో అలియా.. టాలీవుడ్‌లో చర్చ మొదలు!

  • IndiaGlitz, [Tuesday,December 24 2019]

సెక్సీయెస్ట్ లేడీ ఆఫ్ ది ఏషియా.. బాలీవుడ్ ముద్దుగుమ్మ.. అలియా భట్.. ‘ట్రిపుల్ ఆర్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 30న విడుదల కానుంది. ట్రిపుల్ ఆర్ షూటింగ్ జరుగుతుండగానే.. అలియా మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేయనుందట. ఆశ్యర్యంగా ఉందా.. ఆగండాగండి.

అసలు విషయం ఏంటంటే.. మహేశ్ ప్రొడక్షన్ హౌజ్ ‘జీఎంబీ’లో నటిస్తుందట. గూఢచారి టీమ్ అడివి శేష్, శశికిరణ్ టిక్కా కాంబినేషన్‌లో మహేశ్ నిర్మిస్తున్న ‘మేజర్’ సినిమాలో ఈ తార కనిపించనుందట. తెలుగు, హిందీలలో నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రంలో ఆమె నటించడంతో నార్త్‌లో కూడా మార్కెట్ చేసుకోవచ్చని నిర్మాతలు భావిస్తున్నారు. సోనీ పిక్చర్స్ కూడా నిర్మాణంలో పాలుపంచుకుంటోంది. 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఉన్ని కృష్ణన్ పాత్రలో అడివి శేష్ నటిస్తున్నాడు.

మహేశ్ తను నటిస్తూ, నిర్మించిన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు.’ ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన రష్మిక నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కనిపించనున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11న భారీ ఎత్తున విడుదలవుతోంది. దిల్ రాజు, అనిల్ సుంకర సహ నిర్మాతలు. సంగీత, ప్రకాశ్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

More News

రాజధానిపై రైతుల ఆందోళనలో తప్పులేదు.. కచ్చితంగా కోడి పందాలుంటాయ్!

ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చేమోనని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేసిన నాటి నుంచి అమరావతికి భూములిచ్చిన రైతులు ఆందోళనలు చేపడుతున్నారు.

జనవరి 1న 'రాజా నరసింహా'

''అదొక మారుమూల అటవీ ప్రాంతం. డబ్బు సంపాదనే లక్ష్యంగా ఓ వ్యక్తి తయారు చేసే కల్తీ మందుతాగి అక్కడ 75 మంది చనిపోయారు.

చిరంజీవి - కొరటాల చిత్రానికి భారీ ప్లాన్

మెగాస్టార్ చిరంజీవి... ప‌దేళ్ల త‌ర్వాత ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చి పెద్ద స‌క్సెస్‌నే సొంతం చేసుకున్నారు.

మారుతి తదుప‌రి ఆయ‌న‌తోనేనా..?

రీసెంట్‌గా విడులైన `ప్ర‌తిరోజూ పండ‌గే` చిత్రంతో ద‌ర్శ‌కుడు మారుతి సూప‌ర్‌హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు.

వెన్నునొప్పితో ఆస్పత్రికెళితే యువతి శరీరంలో బుల్లెట్.. అసలేం జరిగింది!?

హైదరాబాద్‌లోని ఫలక్‌నుమాకు చెందిన అస్మాబేగం అనే యువతి వెన్ను నొప్పితో నిమ్స్‌లో అడ్మిట్ అవ్వడంతో..