ఓటీటీలో అక్ష‌య్‌కుమార్ మూవీ..?

  • IndiaGlitz, [Monday,April 27 2020]

క‌రోనా ఎఫెక్ట్‌తో సినిమా ప‌రిశ్ర‌మ‌కు గ‌డ్డుకాలం న‌డుస్తుంద‌నే చెప్పాలి. ఎందుకంటే ఓ ప‌క్క సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. సినిమాలు రిలీజ్‌లు ఆగిపోయాయి. ఇది నిర్మాత‌లకు పెద్ద సంక‌టంగా మారింది. ఎందుకంటే సినిమాను అనుకున్న టైమ్‌లో రిలీజ్ చేయ‌క‌పోతే ఫైనాన్సియ‌ర్స్ నుండి వారికి స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. అయితే ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే సినిమాలు థియేట‌ర్స్‌లో విడుద‌ల కావ‌డం అంత సుల‌భంగా క‌నిపించ‌డం లేదు. అస‌లు థియేట‌ర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయ‌నే దానిపై ఎవ‌రికీ క్లారిటీ లేదు. ఒక‌వేళ క‌రోనా ఎఫెక్ట్ త‌గ్గినా ఒకేసారి స‌డ‌లింపు ఉండ‌దు. ద‌శ‌ల వారిగానే స‌డ‌లింపు ఉంటుంది. ఈ సడ‌లింపుల్లో సినిమా థియేట‌ర్స్‌, మాల్స్‌కు చివ‌రి స్థానం ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. దీంతో నిర్మాత‌లు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అన్వేషిస్తున్నారు.

ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కు ఆద‌ర‌ణ పెరుగుతుంది. ఈ క‌రోనా టైమ్‌లో ఓటీటీల‌కు వ్యూవ‌ర్స్ పెరిగారు. దీంతో నిర్మాత‌లు త‌మ సినిమాల‌ను ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారని, ఆ దిశ‌గా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. తాజా సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ..అక్ష‌య్ కుమార్ హీరోగా రాఘ‌వ లారెన్స్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హార‌ర్ థ్రిల్ల‌ర్ కామెడీ చిత్రం ల‌క్ష్మీబాంబ్ రూపొందుతోన్న‌ సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని థియేట‌ర్స్‌లో కాకుండా ఓటీటీలో విడుద‌ల చేస్తార‌ని, ఆ దిశ‌గా నిర్మాత‌లు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

More News

ప‌వ‌న్ చిత్రంలో త‌మిళ హీరో...?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత రెండు సినిమాల్లో న‌టిస్తున్నారు. బాలీవుడ్ చిత్రం

సినీ నృత్య కళాకారులకు రాఘవ లారెన్స్ 5,75,000 ఆర్థిక సహాయం

పని లేక ఇబ్బందులు పడుతున్న పేద నృత్య కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందించారు హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్. ఒక్కొక్కరికీ 25,000 రూపాయల చొప్పున హైదరాబాద్ లో

కరోనా నేపథ్యంలో ప్రాణాల మీదికి తెస్తున్న అష్టాచమ్మ, పేకాట!

కరోనా వైరస్‌ ఎంత ప్రమాదకరంగా ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇటీవలే.. కరోనా మహమ్మారి ఎంత ప్రమాదమో

ప‌వ‌న్‌కు పొలిటిక‌ల్‌గా చిరు స‌ల‌హాలిచ్చారా?

అన్న‌య్య చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన త‌ర్వాత త‌మ్ముడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీని స్టార్ట్ చేశారు. రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ రాజ‌కీయ పార్టీ

బ‌న్నీసెకండ్ హీరోయిన్‌... అంతా రూమ‌రేన‌ట‌!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. ఆర్య‌, ఆర్య‌2 చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది