Dhootha : అక్కినేని నాగచైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ ‘దూత’ ట్రైలర్ చూశారా.. క్రైమ్, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో అదరహో

  • IndiaGlitz, [Thursday,November 23 2023]

హిట్టు , ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ప్రయోగాలకు పెద్ద పీట వేస్తూ ముందుకు సాగే నటుల్లో అక్కినేని వారసుడు నాగచైతన్య ఒకరు. ప్రేక్షకులకు వినోదం పంచడమే లక్ష్యంగా ఆయన సినిమాలు చేస్తుంటారు. ఓటీటీల రాకతో వెబ్ సిరీస్‌లకు ప్రజల నుంచి ఆదరణ వస్తుండటంతో స్టారో హీరోలు సైతం వెబ్ సిరీస్‌ల వైపు చూస్తున్నారు. మిడ్ రేంజ్ హీరోలు ఈ మార్కెట్‌లో సత్తా చాటుతున్నారు. దీనిలో భాగంగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య నటించిన వెబ్ సిరీస్ ‘దూత ’. తద్వారా తెలుగు పరిశ్రమలో తొలిసారి వెబ్ సిరీస్ చేసిన హీరోగా చైతూ నిలిచారు.

ఇక క్రైమ్, మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ ‘‘దూత ’’ వెబ్ సిరీస్‌పై భారీ అంచనాలున్నాయి. ఇవాళ నాగచైతన్య పుట్టినరోజు కావడంతో దూత ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో నాగచైతన్య ఓ జర్నలిస్ట్‌గా కనిపిస్తున్నట్లుగా అర్ధమవుతోంది. ఓ మర్డర్ కేసులో ఆయన ఇరుక్కోవడం , అందులోంచి ఎలా బయటపడ్డాడు, ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో దూత వెబ్ సిరీస్ తెరకెక్కింది. శరద్ మరార్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాల నిడివితో రానుంది. డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ‘‘దూత’’ స్ట్రీమింగ్ కానుంది. మనం, థ్యాంక్యూ తర్వాత నాగచైతన్య- విక్రమ్ కే కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ ప్రాజెక్ట్ ‘‘దూత’’ కావడం విశేషం.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నాగచైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో ‘‘తండేల్’’ అనే సినిమా చేస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. సముద్రంలో వేటకెళ్లే మత్స్యకారులు, వారు ఎదుర్కొనే ఇబ్బందుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకార గ్రామాల్లో నాగచైతన్య పర్యటించిన సంగతి తెలిసిందే.

More News

Bigg Boss Telugu 7 : ప్రశాంత్‌ను నమ్మించి బలి చేసిన శివాజీ.. శోభతో గొడవ , లాఠీ విసిరికొట్టిన అమర్‌దీప్ .. రతికతో గౌతమ్ లవ్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 80 రోజులు  పూర్తి చేసుకుంది. మరికొద్దిరోజుల్లో సీజన్ ముగియనుంది.

Yuvagalam Padayatra:ఈనెల 27న 'యువగళం' పాదయాత్ర పున:ప్రారంభం.. రూట్ మ్యాప్ ఖరారు..

టీడీపీ యువనేత నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ఈ నెల 27న పున:ప్రారంభం కానుంది. ఈ మేరకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

KTR:సిరిసిల్లలో కేటీఆర్‌కు ఓటమి భయం.. ఆడియో కాల్ వైరల్..

తెలంగాణ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా జరుగుతోంది. ప్రచారానికి ఇంకో ఆరు రోజులు మాత్రమే సమయం ఉండటంతో

Kannappa : మంచు విష్ణు ‘‘కన్నప్ప’’ ఫస్ట్ లుక్ చూశారా.. సినిమాపై అంచనాలు పెంచేసిందిగా.. !!

మంచువారి వారసుడు విష్ణు.. హిట్టు కొట్టి చాలా ఏళ్లే అవుతోంది. ఎన్ని ప్రయోగాలు, ప్రయత్నాలు చేసినా ఆయనకు గెలుపు దక్కడం లేదు.

BRS Party: బీఆర్ఎస్ పార్టీదే మళ్లీ అధికారం.. న్యూస్‌టాప్ సర్వేలో స్పష్టం

తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని న్యూస్ టాప్ సర్వే తెలిపింది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం నవంబర్ 16 నుంచి 21 మధ్య ఈ సర్వే చేశామని..