సందడంతా అక్కినేని ఫ్యామిలీదే..

  • IndiaGlitz, [Wednesday,June 13 2018]

మెగా ఫ్యామిలీ త‌రువాత ఎక్కువ మంది హీరోలు ఉన్న ఫ్యామిలీగా అక్కినేని ఫ్యామిలీని చెప్పుకోవ‌చ్చు. నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌, అఖిల్‌, సుమంత్‌, సుశాంత్‌.. ఇలా చెప్పుకోద‌గ్గ సంఖ్య‌లో ఈ కుటుంబానికి చెందిన‌ క‌థానాయ‌కులు ఉన్నారు.

ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ద్వితీయార్థంలో వీరి సినిమాల హ‌వా ఎక్కువ‌గా క‌నిపించ‌నుంది. ముఖ్యంగా జూలై నుంచి అక్టోబ‌ర్ వ‌ర‌కు అక్కినేని ఫ్యామిలీ నుంచి క‌నీసం ఓ సినిమా రాబోతోంది. ఆ వివ‌రాల్లోకి వెళితే.. జూలై 27న నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా న‌టించిన స‌వ్య‌సాచి రిలీజ్ కానుండ‌గా.. ఆగ‌స్టు చివ‌రి వారంలో శైల‌జా రెడ్డి అల్లుడు విడుద‌ల‌య్యే అవ‌కాశ‌ముంది.

ఇక సెప్టెంబ‌ర్‌లో కింగ్ నాగార్జున మ‌ల్టీస్టార‌ర్ మూవీ సంద‌డి చేయ‌నుంది. అలాగే అక్టోబ‌ర్ నెల‌లో అఖిల్ హీరోగా న‌టిస్తున్న మూడో చిత్రం రాబోతోంది. అన్నీ అనుకున్న‌ట్లుగా కుదిరితే.. నాలుగు నెల‌ల పాటు అక్కినేని వారి సినిమాల సంద‌డి తెలుగు తెర‌పై కొన‌సాగనుంద‌న్న‌మాట‌.

More News

ఒకే నెల‌లో రెండు మెగా ఫ్యామిలీ చిత్రాలు

ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్ద‌రు క‌థానాయ‌కుల చిత్రాలు.. ఒకే నెల‌లో విడుద‌ల‌వ‌డం అప్పుడ‌ప్పుడు జ‌రిగే విష‌య‌మే. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో మెగా ఫ్యామిలీకి చెందిన సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన ఇంటిలిజెంట్‌

క్రైమ్ థ్రిల్ల‌ర్‌ను పూర్తి చేసిన స‌మంత‌

'రంగ‌స్థ‌లం', 'మ‌హాన‌టి', 'అభిమ‌న్యుడు' చిత్రాల‌తో ఈ వేస‌విలో హ్యాట్రిక్ విజ‌యాల‌ను సొంతం చేసుకున్నారు స‌మంత‌. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ మూడు చిత్రాల‌లో న‌టిస్తున్నారు.

మ‌రో బ‌యోపిక్‌లో విద్యాబాల‌న్‌?

ఉత్త‌మ న‌టిగా ప‌లు అవార్డుల‌ను అందుకున్న బాలీవుడ్ న‌టి విద్యా బాల‌న్‌. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెర‌కెక్కిన ది డ‌ర్టీ పిక్చ‌ర్‌తో ఉత్త‌మ న‌టిగా జాతీయ అవార్డును అందుకున్నారు.

పుల్లెల గోపీచంద్ బ‌యోపిక్ అప్‌డేట్‌

బ్యాడ్మింట‌న్ ఆట‌గాడు, కోచ్ పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా ఓ బ‌యోపిక్ రాబోతున్న‌ట్లు గ‌త కొంత కాలంగా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా సాయిప‌ల్లవి?

'ఫిదా' చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయిక సాయిప‌ల్ల‌వి. ఆ త‌రువాత 'ఎంసీఏ' చిత్రంతో మ‌రో విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు.