హ‌రిత హారం లో.. అక్కినేని ఫ్యామిలీ

  • IndiaGlitz, [Monday,July 11 2016]

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన హ‌రిత హారం కార్య‌క్ర‌మానికి సినీ ప్ర‌ముఖుల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తుంది. స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే మంచి కార్య‌క్ర‌మాలు చేయ‌డంలో ఎప్పుడూ ముందుండే అక్కినేని ఫ్యామిలీ హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో కూడా ముందుండి ఎంతో మందికి స్పూర్తి నిచ్చారు. రెండు రోజుల క్రితం అక్కినేని అఖిల్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ద‌గ్గ‌ర‌లో ఏర్పాటు చేసిన హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో పాల్గొని మొక్క‌లు నాటారు.

అనంత‌రం అఖిల్ మాట్లాడుతూ...చిన్న‌ప్ప‌టి నుంచి జంతువులు, ప‌ర్యావ‌ర‌ణం కు సంబంధించిన విష‌యాల‌పై ఆసక్తి ఎక్కువ‌. ప్ర‌తి ఒక్క‌రు ఒక మొక్క‌ను నాటితే మ‌న‌తో పాటు భ‌విష్య‌త్ త‌రాల‌కు ఎంతో మంచిది అంటూ స్పందించారు. ఈరోజు అక్కినేని నాగార్జున అన్న‌పూర్ణ స్టూడియోస్ స్టాఫ్ తో క‌లిసి హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా మొక్క‌లు నాటారు. అలాగే జూబ్లీహిల్స్ పోలీసుల‌తో క‌లిసి కూడా నాగార్జున మొక్క‌ల‌ను నాటి ప్ర‌తి ఒక్క‌రు మొక్క‌లు నాటాల‌ని పిలుపు ఇచ్చారు. నాగార్జున ఇచ్చిన పిలుపుతో అభిమానులు హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా కూక‌ట్ ప‌ల్లిలో మొక్క‌లు నాటారు. కూక‌ట్ ప‌ల్లిలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో అమ‌ల అక్కినేని పాల్గొని మొక్క‌లు నాటారు. ఇలా...అక్కినేని కుటుంబం హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో పాల్గొని మొక్క‌ల‌ను నాటి అంద‌రిలో స్పూర్తి నింపడం అభినందనీయం.

More News

'డా.చక్రవర్తి' పాటలు విడుదల

అదృష్టం, ఎ ఫిలిం బై అర‌వింద్‌, అర‌వింద్‌, త్రీ` వంటి విల‌క్ష‌ణ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ సూరి డైరెక్ష‌న్‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర మూవీస్ బ్యాన‌ర్‌పై రిషి, సోనియా మాన్‌, గిరీష్‌, లీనా, వంశీ ప్ర‌ధాన తారాగ‌ణంగా ఎ.వెంక‌టేశ్వ‌ర్లు(చాంఫ్‌), ర‌త్న‌మాల రెడ్డి, శేఖ‌ర్ సూరి నిర్మిస్తోన్న చిత్రం డా.చ‌క్ర‌వ‌ర్తి.

ఘనంగా హీరో విక్రమ్ కుమార్తె నిశ్చితార్థం

డిఫరెంట్ కథలతోనే కాదు,గెటప్ లతో కూడా ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న హీరో చియాన్ విక్రమ్.

తలకోనలో రోబో సీక్వెల్.....

సూపర్ స్టార్ రజనీకాంత్,అక్షయ్ కుమార్,శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న రోబో సీక్వెల్ 2.0

మన భాషని, యాసని మరచిపోకూడదు అందుకే సినిమాల ద్వారా సంప్రదాయాల్ని ప్రొత్సహిస్తాను-UKTA 6 వ వార్షికోత్సవంలో పవన్

యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేషన్(UKTA)ఆరవ వార్షికోత్సవ వేడుకలు జయతే కూచిపూడి,జయతే బతుకమ్మ సాంస్కృతిక వేడుకలు లండన్ త్రాక్సిలో ఘనంగా నిర్వహించారు.

జూలై 15న విడుదలవుతున్న 'నిన్నే కోరుకుంటా'

శుభకరి క్రియేషన్స్ పతాకంపై సందీప్,విజయ్ భాస్కర్,ఆనంద్,పూజిత,సారిక మొదలగువారు ప్రధాన తారాగణంగా గణమురళి దర్శకత్వంలో నిర్మాత మరిపి విద్యాసాగర్ నిర్మించిన చిత్రం ‘నిన్నే కోరుకుంటా’.