రేపు స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌నున్న అఖిల్‌

  • IndiaGlitz, [Monday,November 13 2017]

అఖిల్ చిత్రంతో క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మైన అక్కినేని అఖిల్‌.. ప్ర‌స్తుతం మ‌నం డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌లో మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు రూ.45 కోట్ల బ‌డ్జెట్‌తో అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ సినిమా క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 22న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన ఓ స‌ర్‌ప్రైజ్‌ని రేపు ఇవ్వ‌బోతున్న‌ట్లు అఖిల్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. బ‌హుశా.. అది టీజ‌ర్‌కి సంబంధించిన విష‌యం కావ‌చ్చ‌ని వినిపిస్తోంది.

కాగా, తాజాగా హ‌లో చిత్రానికి సంబంధించి ఓ పోస్ట‌ర్ లీకైంది. అందులో టీజ‌ర్ ఫాస్ట్ సూన్ అని ఉంది. అంటే.. టీజ‌ర్‌కి సంబంధించే అఖిల్ స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్నాడ‌న్న‌మాట‌.

నాగ్ ఈ టీజ‌ర్‌కి వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌నున్నార‌ని ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత‌మందిస్తున్నాడు.

More News

దేవిశ్రీ ప్ర‌సాద్ చిత్రంతో..ధ‌న‌రాజ్ ఏ పాత్ర అయినా బాగా చేస్తాడ‌నే మంచి పేరొస్తుంది - ధ‌న‌రాజ్‌

యశ్వంత్ మూవీస్ సమర్పణలో,  ఆర్ ఓ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్నచిత్రం 'దేవిశ్రీప్రసాద్'. పూజా రామచంద్రన్, భూపాల్, ధనరాజ్, మ‌నోజ్ నందం ప్రధాన పాత్రలుగా పోషిస్తున్న ఈ చిత్రానికి శ్రీ కిషోర్ దర్శకుడు.

మాల్స్‌లో నా పేరు సూర్య‌

దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ త‌రువాత అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం నాపేరు సూర్య‌. నా ఇల్లు ఇండియా అనేది దీనికి ట్యాగ్‌లైన్‌. ర‌చ‌యిత వ‌క్కంతం వంశీ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కానున్నాడు.

అల్లు శిరీష్‌ షూటింగ్‌లో ప‌వ‌ర్‌స్టార్‌

త‌న గ‌త చిత్రం శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తుతో మంచి విజ‌యాన్ని అందుకున్నాడు అల్లు వారి క‌థానాయ‌కుడు అల్లు శిరీష్.  ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా ఫేమ్ వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక్క క్ష‌ణం చేస్తున్నాడు.

నాగ్‌,వ‌ర్మ చిత్రంలో అమితాబ్?

24 ఏళ్ల త‌రువాత కింగ్ నాగార్జున‌, సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో సినిమా రానున్న సంగ‌తి తెలిసిందే. న‌వంబ‌ర్ 20 నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ సినిమాని ఏప్రిల్ 20న విడుద‌ల చేయ‌డానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది

అప్పుడు లెక్చ‌ర‌ర్‌.. ఇప్పుడు ప్రొఫెస‌ర్‌

25 ఏళ్ల క్రితం కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సుంద‌ర‌కాండ‌లో లెక్చ‌ర‌ర్‌గా విక్ట‌రీ వెంక‌టేష్ చేసిన సంద‌డి అంత సులువుగా మ‌ర‌చిపోలేం. ఘ‌న‌విజ‌యం సాధించిన ఆ చిత్రంతో వెంక‌టేష్ కి న‌టుడిగా మరింత గుర్తింపు వ‌చ్చింది.