ఆగస్టు 12న అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రూపొందుతోన్న 'ఏజెంట్' రిలీజ్

ప్రామిసింగ్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి ల హై బడ్జెట్ స్టైలిష్, యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'ఏజెంట్. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది.

శుక్రవారంనాడు మేకర్స్ సినిమా థియేట్రికల్ విడుదల తేదీని ప్రకటించారు. 'ఏజెంట్' చిత్రం స్వాతంత్ర దినోత్సవానికి మూడు రోజుల ముందు ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం దేశభక్తి అంశాలతో రూపొందుతోంది కాబట్టి, స్వాతంత్రదినోత్సవం విడుదలకు అనువైన సమయంగా భావించారు. అంతేకాక ఆగస్ట్ 15వ తేదీ సోమవారం కావడంతో 4 రోజుల వీకెండ్ కూడా కలిసి వచ్చింది.

'ఏజెంట్'లో అఖిల్ యాక్షన్-ప్యాక్డ్ రోల్ లో కనిపించనున్నాడు. ఇందులో అతనిలోని సరికొత్త పార్శ్వం కనిపిస్తుంది. మరోవైపు ఈ సినిమాలో మమ్ముట్టి కూడా పవర్ఫుల్ రోల్లో నటిస్తున్నాడు.

స్పై థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ఎకె ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు.

సెన్సేషనల్ కంపోజర్ హిప్ హాప్ తమిళ సంగీతం అందించగా, రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. అజయ్ సుంకర, పతి దీపా రెడ్డి ఈ చిత్రానికి సహ నిర్మాతలు.

More News

రాధేశ్యామ్‌ను వాడేసిన సజ్జనార్.. ప్రభాస్‌తో పూజ ఏం చెప్పిందంటే..?

తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్ తనదైన వ్యూహాలతో సంస్థను గాడిలో పెట్టేందుకు  ప్రయత్నిస్తున్నారు.

సీఎం కేసీఆర్‌కు అస్వస్థత.. యశోదా ఆసుపత్రికి తరలింపు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో శుక్రవారం వైద్య పరీక్షల కోసం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి యశోద ఆస్పత్రికి వెళ్లారు.

ప్రతి షోకి 100 టికెట్లు పంపండి.. థియేటర్‌ యాజమాన్యాలకు బెజవాడ మేయర్ లేఖ, వైరల్

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ప్రభాస్ రాధేశ్యామ్‌కు ఏపీలో టికెట్ల ధరల పెంపు, అయినా మెలిక పెట్టిన జీవో..!!

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ - పూజా హేగ్డే జంటగా నటించిన ‘‘రాధేశ్యామ్’’

పంజాబ్ : పనిచేయని రియల్‌స్టార్ ప్రభావం.. ఓటమిపాలైన సోనూసూద్ సోదరి మాళవిక

పంజాబ్‌లో  సామాన్యుడి దెబ్బకు దిగ్గజ పార్టీలు విలవిలాడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ  ఘన విజయం సాధించింది.