నాగ్, పూరి మధ్యలో కళ్యాణ్..

  • IndiaGlitz, [Friday,December 11 2015]

కింగ్ నాగార్జున.. అఖిల్ రెండో సినిమా బాధ్య‌త‌ను ఏ డైరెక్ట‌ర్ కి అప్ప‌చెప్పాల‌నే విష‌యం పై చాలా సీరియ‌స్ గా ఆలోచిస్తున్నారు. ఇప్పుడున్న టాప్ డైరెక్ట‌ర్స్ లో కొంత మంది బిజీగా ఉన్నారు. మ‌రి కొంత మంది ఖాళీగా ఉన్నా...స‌క్సెస్ లో లేక వాళ్ళ‌తో చేయ‌డం ఇష్టం లేదు. మ‌రి..ఇలాంటి ప‌రిస్థితుల్లో ఎవ‌రైతే బాగుంటార‌నుకుంటే..ఇక చివ‌రి ఆప్ష‌న్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్.

నిర్మాత సి.క‌ళ్యాణ్ పూరి తో జ్యోతిల‌క్ష్మి లోఫ‌ర్ సినిమాల‌ను నిర్మించిన విష‌యం తెలిసిందే. అలాగే క‌ళ్యాణ్ అఖిల్ సినిమాని త‌మిళ్ లో రిలీజ్ చేసాడు. నాగ్ తో సి.క‌ళ్యాణ్ కి మంచి అనుబంధమే ఉంది. ఈ నెల 17న లోఫ‌ర్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా రిజల్ట్ ను బ‌ట్టి అఖిల్ రెండో సినిమాని డైరెక్ట్ చేయ‌మ‌ని పూరి ని అడ‌గాలా వ‌ద్దా అనేది ఆలోచిస్తార‌ట‌. అయితే అఖిల్ సినిమా గురించి నాగ్, పూరి మ‌ధ్య‌లో నిర్మాత సి.క‌ళ్యాణ్ చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నార‌ని టాక్.

More News

బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా టైటిల్...

తమిళంలో శశికుమార్ హీరోగా రూపొందిన చిత్రం ‘సుందర పాండ్యన్’. ఈ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్, సోనారిక హీరో హీరోయిన్లుగా భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోంది.ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

'హితుడు' మూవీ రివ్యూ

నాయకుడి నుండి ప్రతి నాయకుడి పాత్రకు మారిన జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హితుడు.

రాశి ఈజ్ బ్యాక్

సీనియర్ హీరోయిన్ రాశి ఇప్పుడు మళ్ళీ తెరపై కనిపించబోతుంది.దాదాపు 12 ఏళ్ళ తర్వాత రాశి సినిమాలో కనిపించనుండటం విశేషం.

సెంటిమెంట్ ఫాలో అవుతున్న మారుతి...

ఈరోజుల్లో...అనే చిన్న సినిమాతో పెద్ద విజయాన్ని సాధించి ఇండస్ట్రీ ద్రుష్టిని తన వైపుకి తిప్పుకున్న యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతి.

విష్ణు హీరోయిన్ మారిపోయింది...

మంచు విష్ణు హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.