'ఆటాడుకుందాం..రా' ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

  • IndiaGlitz, [Friday,November 06 2015]

కాళిదాసు, కరెంట్‌, అడ్డా వంటి సూపర్‌హిట్‌ చిత్రాల హీరో సుశాంత్‌ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో శ్రీనాగ్‌ కార్పోరేషన్‌, శ్రీ జి ఫిలింస్‌ పతాకాలపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఆటాడుకుందాం.. రా'(జస్ట్‌ చిల్‌). అఖిల్‌ బాలనటుడిగా నటించిన 'సిసింద్రీ' చిత్రంలోని 'ఆటాడుకుందాం.. రా..' అనే పాట ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. అదే టైటిల్‌తో సుశాంత్‌ హీరోగా రూపొందిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను అఖిల్‌ అక్కినేని విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాతలు చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల మాట్లాడుతూ - ''60 శాతం షూటింగ్‌ పూర్తయింది. సినిమా చాలా బాగా వస్తోంది. నాగేశ్వరరెడ్డి మార్క్‌ కామెడీతోపాటు యాక్షన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. 'ఆటాడుకుందాం..రా' సుశాంత్‌కి మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది'' అన్నారు.

సుశాంత్‌, సోనమ్‌ బజ్వా, బ్రహ్మానందం, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, రఘుబాబు, పృథ్వీ, ఫిరోజ్‌ అబ్బాస్‌, సుధ, ఝాన్సీ, ఆనంద్‌, రమాప్రభ, రజిత తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: నారాయణరెడ్డి, కథ-మాటలు: శ్రీధర్‌ సీపాన, నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.

More News

మహేష్ మాటలతో షాక్ తిన్న వినాయక్..

సూపర్ స్టార్ మహేష్ మాటలతో...సెన్సేషనల్ డైరెక్టర్ వినాయక్ షాక్ తిన్నారు. ఈ విషయాన్ని స్వయంగా వినాయకే మీడియాకి తెలియచేసారు. ఇంతకీ విషయం ఏమిటంటే..అఖిల్ ఆడియో వేడుకకు మహేష్ ముఖ్య అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే

ఈనెల 9న 'మేము' మ్యూజిక్‌ ఫంక్షన్‌

సూపర్‌స్టార్‌ సూర్య-అమలాపాల్‌-బిందుమాధవి నటిస్తున్న ‘మేము’ చిత్రం ఆడియో ఈనెల (నవంబర్‌) 9 సోమవారం సాయంత్రం విడుదల కానుంది. సూర్య-జ్ఞానవేల్‌రాజా సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సాయిమణికంఠ క్రియేషన్స్‌ పతాకంపై జూలకంటి మధుసూదన్‌రెడ్డి నిర్మిస్తున్నారు.

'బ్రహ్మోత్సవం' రిలీజ్ డేట్ ఫిక్స్..

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్నతాజా చిత్రం బ్రహ్మోత్సవం.ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నారు.తెలుగు,తమిళ్ లో పి.వి.పి సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందిస్తుంది.

వన్ మిలియన్ వ్యూస్ తో ట్రెండ్ క్రియేట్ చేసిన 'సైజ్ జీరో' ట్రైలర్

సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ నిర్మించిన భారీ చిత్రం ‘సైజ్ జీరో’. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు.

చిరు మూవీపై వినాయ‌క్ కామెంట్..

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాగా త‌మిళ చిత్రం క‌త్తి సినిమా రీమేక్ చేయ‌నున్న‌ట్టు...ఈ మూవీకి వినాయ‌క్ డైరెక్ట‌ర్ అంటూ వార్త‌లు వ‌చ్చాయి.