గెస్ట్ రోల్ గురించి క్లారిటీ ఇచ్చిన అఖిల్..!

  • IndiaGlitz, [Thursday,August 11 2016]

అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ న‌టిస్తున్న చిత్రం ఆటాడుకుందాం...రా. ఈ చిత్రాన్ని జి.నాగేశ్వ‌ర‌రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. శ్రీనాగ్ కార్పోరేష‌న్ బ్యాన‌ర్ పై చింత‌ల‌పూడి శ్రీనివాస‌రావు, ఎ.నాగ‌సుశీల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ లో అక్కినేని అఖిల్ గెస్ట్ రోల్ చేస్తుండ‌డం విశేషం. ఆటాడుకుందాం...రా అనే టైటిల్ సాంగ్ లో అఖిల్ క‌నిపించ‌నున్నాడు. నిన్న అఖిల్ పై ఈ సాంగ్ ను శేఖ‌ర్ నృత్య ద‌ర్శ‌క‌త్వంలో అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్ లో చిత్రీక‌రించారు.

గెస్ట్ రోల్ చేయ‌డం గురించి అఖిల్ మాట్లాడుతూ....చిన్న‌ప్పుడు నా సిసింద్రీ సినిమాలో సాంగ్ ఆటాడుకుందాం..రా అనేది. ఇప్పుడు సుశాంత్ ఆటాడుకుందాం..రా టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. ఆ విధంగా ఈ సినిమాతో నాకు క‌నెక్ష‌న్ ఉంది. అందుకే ఈ సినిమా నాకు చాలా స్పెష‌ల్. ఈ మూవీలో ఈ సాంగ్ చేస్తున్నాను. అక్కినేని ఫ్యాన్స్ కి ఈ సినిమాతో పండ‌గ మొద‌ల‌వుతుంది అంటూ గెస్ట్ రోల్ ఎందుకు చేస్తున్నారో క్లారిటీ ఇచ్చారు అఖిల్.

More News

నితిన్ నెక్ట్స్ మూవీ ఫిక్స్..

యువ హీరో నితిన్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రూపొందిన అ ఆ చిత్రం ఘ‌న విజ‌యం సాధించి నితిన్ కెరీర్ లో బిగ్ హిట్ గా నిలిచిన విష‌యం తెలిసిందే.

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణికి మ్యూజిక్ అందించేది ఇత‌నే..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న వంద‌వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఈ చిత్రాన్ని క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు క్రిష్ పెళ్లి కార‌ణం బ్రేక్ ప‌డిన షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది.

సునిల్ కెరీర్లోనే పెద్ద కమర్షియల్ సక్సస్ ని అందించిన ప్రేక్షక దేవళ్ళకి మా ధన్యవాదాలు : నిర్మాత ఆర్ . సుదర్శన్ రెడ్డి

సునీల్ హీరోగా, మన్నార్ చోప్రా జంటగా, ప్రేమకథాచిత్రమ్ తరువాత ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా.. వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో రూపొందించిన జక్కన్న చిత్రం జులై 29న విడుదలయ్యింది.

ఆస్కార్ రేసులో 'రుద్ర‌మ‌దేవి'

అనుష్క టైటిల్ పాత్ర‌లో గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత‌గా గుణా టీం వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన హిస్టారిక‌ల్ త్రీడీ చిత్రం రుద్ర‌మ‌దేవి. ఈ చిత్రంలో గోన‌గ‌న్నారెడ్డిగా అల్లుఅర్జున్‌, చాళుక్య వీర‌భద్రుడుగా రానా న‌టించారు.

భారీ రేటుకు 'మ‌నమంతా' శాటిలైట్ హ‌క్కులు

మోహ‌న్ లాల్‌, గౌత‌మి కీల‌క పాత్ర‌ల్లో విశ్వాంత్‌, రైనారావులు తారాగ‌ణంగా విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై సాయికొర్ర‌పాటి నిర్మించిన చిత్రం మ‌నమంతా. ఇటు ప్రేక్ష‌కులే కాదు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న చిత్రంగా నిలిచింది.