అఖిల్ సినిమా పై క్లారిటీ వచ్చేసింది...

  • IndiaGlitz, [Tuesday,May 17 2016]

అక్కినేని అఖిల్ రెండో సినిమాని వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న‌ట్టు గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే..బ‌డ్జెట్ ఎక్కువ అవుతుండ‌డం వ‌ల‌న అఖిల్ - వంశీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది అంటూ వార్త‌లు వ‌చ్చాయి. ఆత‌ర్వాత అఖిల్ బాలీవుడ్ మూవీ ఏ జ‌వానీ హే దివానీ రీమేక్ చేయాల‌నుకుంటున్నాడు. అయితే..ఊపిరి త‌ర్వాత మ‌ళ్లీ రీమేక్ మూవీ చేయ‌డం ఇష్టం లేదంటూ వంశీ ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నాడు అంటూ మ‌రో వార్త ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఈ వార్త‌ల పై అఖిల్ స్పందిస్తూ...ఈ వార్త‌ల్లో వాస్త‌వం లేదు. వాస్త‌వాలు తెలుసుకోకుండా ఎలా వార్త‌లు రాస్తారంటూ ఆ వార్త‌లు రాసిన వెబ్ సైట్స్ పై ఫైర్ అయ్యాడు అఖిల్.
ఇదిలా ఉంటే....తాజాగా అఖిల్ త‌న రెండో సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ...వంశీతో వ‌ర్క్ చేయాల‌నుకుంటున్నాను. రీమేక్ అయినా...కొత్త క‌థ‌తో అయినా స‌రే వంశీతో సినిమా చేయ‌డానికి నేను రెడీ. జులై నెలాఖ‌రుకు ఈ సినిమా పై క్లారిటీ వ‌స్తుంది. ఖ‌చ్చితంగా వంశీతో చేసే సినిమా ఏ జ‌వానీ హే దివానీ రీమేక్ కాదు అంటూ క్లారిటీ ఇచ్చేసాడు అఖిల్.

More News

చెప్పను బ్రదర్.. అంటూ జోకులు..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు సక్సెస్ మీట్ లో మాట్లాడుతున్నప్పుడు ...పవన్ గురించి మాట్లాడమని అభిమానులు అడిగితే...ఏ ముహుర్తాన చెప్పను బ్రదర్....అన్నాడో కానీ..

'జెంటిల్ మన్' రిలీజ్ డేట్....

నాని హీరోగా నటించిన తాజా చిత్రం 'జెంటిల్ మన్'.మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు.

జ్యోతిల‌క్ష్మికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు..

నీతోడు కావాలి చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై...త‌న అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుని త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్న ఛార్మింగ్ బ్యూటీ ఛార్మి. అనుకోకుండా ఒక రోజు, మాస్, ల‌క్ష్మీ, పౌర్ణ‌మి, రాఖీ త‌దిత‌ర చిత్రాల‌తో ఆడియోన్స్ ను ఆక‌ట్టుకుంది.

ఫీల్ గుడ్ హ్యాట్రిక్ వచ్చేనా?

ఏకకాలంలో ఓ నిర్మాత మూడు చిత్రాలను నిర్మించడమే ఒక విశేషమైతే..ఆ మూడు కూడా ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ లుగా రూపొందడం మరో విశేషం.

కేన్స్ చల‌న చిత్రోత్స‌వంలో బాహుబ‌లి సంద‌డి..

ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన తెలుగు సినిమా బాహుబ‌లి. ప్ర‌భాస్, రానా, అనుష్క‌, త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ.. ప్ర‌ధాన పాత్ర‌ల్లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి సినీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు రికార్డు స్ధాయి కలెక్ష‌న్స్ సొంతం చేసుకుంది.