హగ్ చేసుకున్న అఖిల్, అభి.. సందడిగా సాగిన షో..

  • IndiaGlitz, [Wednesday,December 16 2020]

‘ట్రెండ్ మారినా.. ఫ్రెండ్ మారడే..’ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. ఆ వెంటనే గీతా మాధురి, హరి తేజ, శ్రీముఖి, అలీ రెజాను చూపించారు. వాళ్లకు కంటెస్టెంట్లతో మాట్లాడే అవకాశాన్ని బిగ్‌బాస్ కల్పించారు. వాళ్ల సీజన్స్‌లో ఎలా ఉండేదని ఒకరికొకరు చెప్పుకున్నారు. నలుగురినీ చూసి కంటెస్టెంట్లు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. కోవిడ్ కారణంగా ఇంట్లోకి రాలేకపోయామని చెప్పారు. మిక్సీ, గ్రైండర్ మీకెందుకు.. చికెన్, మటన్ మీకెందుకంటూ సందడి చేశారు. సొహైల్ నువ్వు చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలని అడిగారు. అఖిల్‌ని మోనాల్ వెళ్లిపోయాక సైలెంట్ అయ్యావేంటని అడిగాడు. బయటకు వచ్చాక మోనాల్‌కు ఏదో చెబుతానన్నావు ఏంటది? అని అడిగారు. మిస్టర్ కూల్ అని అభికి శ్రీముఖి కితాబిచ్చింది. మీరంతా చాలా బాగున్నారని అభి అంటే మనల్ని కూడా వదలడంటూ హరితేజ ఫన్ చేసింది. అభికి ఈ మధ్య డ్యాన్సులు బాగా చేస్తున్నావని చెప్పారు. నామినేషన్ ప్రక్రియ చూసినప్పుడు ఎలా ఫీలయ్యారో చెప్పారు. ఇక నన్ను నిన్ను లౌడ్ స్పీకర్ అన్నారని హరితేజ.. శ్రీముఖికి చెప్పింది. కానీ ఇక్కడ పెద్ద లౌడ్ స్పీకర్ ఉందని అరియానా గురించి చెప్పింది.

అరియానాకు టాప్ ఫైవ్‌లో అవకాశం దొరికినప్పుడు ఎలా చేసిందో సొహైల్ చేసి చూపించాడు. ఇక చింటూని సొహైల్ ఏం చేశాడో తెలుసా? అంటూ అరియానాకు సొహైల్ చేసిన రచ్చంతా చెప్పారు. అరియానా, సొహైల్ ఎప్పుడు హగ్ చేసుకుంటారు? అభి, అఖిల్ ఎప్పుడు హగ్ చేసుకుంటారని చాలా ఆతృతగా చూశామని చెప్పారు. వెంటనే అభి, అఖిల్ హగ్ చేసుకున్నారు. చాలా సందర్భాల్లో అరియానా.. ఇంటికి అగెనెస్ట్‌గా వెళ్లావని శ్రీముఖి చెప్పింది. అది ఎలా అనిపించిందని అడిగింది. అరియానాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఐదుగురూ కూల్‌గా హ్యపీగా ఉండాలని.. హౌస్‌ని తర్వాత మిస్ అవుతారని చెప్పారు. ఇక హారిక గురించి చోటు అంటారు కానీ నీ డెసిషన్ మేకింగ్.. టాస్క్‌లు ఆడే విధానం సూపర్ అని చెప్పారు. హారిక కోసం ఒక పాట వేయమని హరితేజ అడిగితే బిగ్‌బాస్ ‘వెల్ కమ్ వెల్ కమ్ పార్టీ’ సాంగ్ వేశారు. తరువాత అంతా వచ్చి డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. అభిని చాలా మంది అమ్మాయిల అటెన్షన్‌ను గ్రాబ్ చేస్తున్నావని. . కొన్ని టిప్స్ ఇవ్వమని అలీ అడిగాడు. అభితో కూడా పాట పాడించారు. తనను అర్జున్‌రెడ్డి అనే వాళ్లని.. ఇప్పుడు సొహైల్ దానిని దాటేశాడని అలీ చెప్పాడు. నీ వల్ల నేను మంచివాడినయ్యానని అలీ ఫన్నీగా చెప్పాడు. గోల్డెన్ మైక్ పట్టుకుని సొహైల్ ఏమేం చేశాడో కూడా చెప్పారు.

ఫినాలేలో నువ్వు, అఖిల్ స్టేజిపై ఉన్నారు. అప్పుడు నాగ్ ఎవరికి ఇవ్వాలంటే ఏం చేస్తావని సొహైల్‌ను అడిగారు. నాకే కావాలని చెబుతానని చెప్పాడు. మోస్ట్ డిజైరబుల్ మ్యాన్‌గా అఖిల్‌ను అభివర్ణించారు. మోనాల్ విషయంలో ఎందుకు ఫైర్ అయ్యావని అడిగారు. టాస్క్‌ల్లో నీ స్పీడ్ సూపర్బ్ అని అడిగారు. టికెట్ టు ఫినాలే విన్ అయ్యాక చాలా రిలాక్స్ అయ్యావని చెప్పారు. అయితే నేను రిలాక్స్ అవలేదు. నాతో ఎవరు టాప్ ఫైవ్‌లో ఉంటారనే టెన్షన్ బాగా ఉండిందని చెప్పారు. అభి తామంతా చేసుకోవాల్సిన మార్పుల గురించి చెప్పాలని నలుగురినీ అడిగాడు. కూల్‌గా ఉండాలని.. ఈ నాలుగు రోజులు ఎంజాయ్ చేయాలని.. స్ట్రెస్ అవ్వొద్దని హరితేజ చెప్పింది. గీతా మాధురి కూడా దాదాపు అదే చెప్పింది. ఆ ఇంట్లో ఇంకో నాలుగు రోజులే ఉంటారు కాబట్టి ఇంటిని ఎంజాయ్ చేయండని చెప్పింది. అఖిల్ బాగా పులిహోర కలిపాడని చెప్పాడు. అఖిల్ ఒక్కడికే హౌస్‌లో అన్ని రిలేషన్స్ ఉన్నాయని ఫన్నీగా చెప్పారు. తాను లాస్ట్ వీక్‌లో బాగా చిల్ అయ్యానని శ్రీముఖి చెప్పింది. బయట ఏం జరుగుతుందోనన్న విషయం పక్కనబెట్టి చిల్ అవ్వాలని చెప్పింది. సెవెన్త్ వీక్ తన దురదృష్టం వల్ల బయటకు వెళ్లిపోయానని అలీ చెప్పాడు. ఏం చూపించాలనుకున్నారో 14 వారాల్లో చూపించారని.. ఇక ఎంజాయ్ చేయాలని చెప్పాడు. మాకు ఇలా ఎవ్వరూ చెప్పలేదని హరితేజ చెప్పింది. ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్లిపోయారు. ఇక హారికకు లవ్ యు పెట్టానని అఖిల్ చెప్పాడు. ఇక వాష్‌రూమ్‌లో చింటు గాడి దగ్గర సొహైల్ ఏం చేశాడో అరియానాకు చెప్పాడు. మొత్తానికి ఇవాళ్టి షో హరితేజ, గీతా మాధురి, శ్రీముఖి, అలీ రాకతో చాలా సందడిగా సాగిపోయింది.

More News

కరోనాతో పోరాడి ఇంటికి చేరిన అనంతరం పక్షవాతానికి గురైన నటి..

కరోనా కారణంగా ఎవరేంటనే విషయం తెలిసొచ్చింది. అసలైన హీరో, హీరోయిన్లు ఎవరనే విషయం తెలిసింది.

ఇకపై దుర్గమ్మను దర్శించుకోవాలంటే డబుల్ చెల్లించుకోవాల్సిందే..

బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి రేట్లు భారీగా పెంచేశారు. ఈ నిర్ణయాన్ని దుర్గగుడి అధికారులు తీసుకోగా..

వాయిదా పడిన సింగర్ సునీత వివాహం..

ప్రముఖ సింగర్ సునీత మరోసారి వివాహానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మొదటి భర్తతో విడాకులు తీసుకున్న సునీత..

చేపల వేటకు వెళ్లిన వారికి షాక్... బీచ్‌లో కొట్టుకొచ్చిన బంగారం

చేపల వేటే వారికి జీవనాధారం.. వాటిని పట్టుకుని అమ్మితేనే రోజు గడుస్తుంది. ఎప్పటిలాగే మత్స్యకారులంతా ఆ రోజు కూడా చేపల వేటకు వెళ్లారు.

భర్తతో కలిసి ‘ఆచార్య’ సెట్స్‌కి కాజల్.. బొకేతో మెగాస్టార్ స్వాగతం

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆచార్య. వీరిద్దరి కాంబోలో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్నంటాయి.