అఖిల్ అక్కినేని - సురేందర్ రెడ్డి - అనిల్ సుంకరల కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్

యంగ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. చిరంజీవి సైరా నరసింహా రెడ్డితో బ్లాక్ బస్టర్ కొట్టిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా భారీ సినిమా రూపొందనుంది. వక్కంతం వంశీ అందించిన పవర్ ఫుల్ స్టొరీతో ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందనుంది . అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డిల క్రేజీ కాంబినేషన్లో రానున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సరెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు.

తన చిత్రాల్లో హీరోలను అత్యంత స్టైలిష్ గా ప్రజెంట్ చేసే దర్శకుడు సురేందర్ రెడ్డి, అఖిల్ అక్కినేని 5వ చిత్రంలో అఖిల్ ని సరికొత్తగా ఆవిష్కరించనున్నారు. 2020 సంవత్సరాన్ని సరిలేరు నీకెవ్వరు లాంటి భారీ బ్లాక్ బస్టర్ తో ప్రారంభించిన ఏకే ఎంటర్టెన్మెంట్స్ బిగ్ స్కేల్ లో నిర్మించనున్న అఖిల్ 5 తో తన విజయపరంపరను కొనసాగించనుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

హీరో: అఖిల్ అక్కినేని, దర్శకత్వం: సురేందర్ రెడ్డి,

More News

‘మౌనరాగం’ ఫేమ్ శ్రావణి ఉసురు తీసిన టిక్‌టాక్...

‘మౌనరాగం’ ఫేమ్ శ్రావణి మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. టిక్‌టాక్ ఆమె జీవితాన్ని బలి తీసుకుంది.

డైరెక్టర్‌కి ఖరీదైన కారుని గిఫ్ట్‌ ఇచ్చిన నితిన్‌..!

ఈ మధ్య కాలంలో హీరోలు వారికి నచ్చిన వారికి అంటే దర్శకులకు, టెక్నీషియన్స్‌కు తమకెంతో ఇష్టమైన శ్రేయోభిలాషులకు ఖరీదైన కార్లను గిఫ్ట్‌గా ఇస్తున్నారు.

పిఠాపురం, అంతర్వేది ఘటనలు యాధృచ్చికాలు కావు: పవన్

అంతర్వేదిలో రథం దహనమైన ఘటనపై జనసేన అధినేత తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మతిస్థిమితం లేని వారు చేసిన పనో..

చిన్నపాటి యుద్ధానికి వేదికగా మారిన గాంధీభవన్..

తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏ మీటింగ్ నిర్వహించాలన్నా.. గాంధీభవన్‌లోనే నిర్వహిస్తుంటారు. కానీ ఈ మధ్య గాంధీభవన్ బాహాబాహీలకు..

'డిటెక్టివ్ 2' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన విశాల్‌

హీరో , నిర్మాత అయిన విశాల్ ద‌ర్శ‌కుడిగా మారి తెర‌కెక్కించిన చిత్రం డిటెక్టివ్ 2. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు.