పాట పాడిన అఖిల్...

  • IndiaGlitz, [Saturday,July 01 2017]

హీరో అఖిల్ తొలిసారి పాట పాడాడు. ఏ సినిమాలో అనుకుంటున్నారా..సినిమాలో కాదండి..స్టేజ్ మీద‌. దుబాయ్‌లో సైమా 2016 అవార్డ్స్ ఫంక్ష‌న్ అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ వేడుక‌లో అఖిల్ పాట పాడాడు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే అఖిల్ త‌న తాత‌య్య‌, నాన్న‌గారి, అన్న‌య్యో లేక పాట పాడ‌లేదు. త‌న సినిమాలోని పాట‌నే పాడాడు. కానీ ఇక్క‌డ కొస మెరుపు ఏంటంటే, అఖిల్ పాడిన పాట ఇంకా చిత్రీక‌ర‌ణ‌లో ఉన్న త‌న సినిమాలోనిదే. 'మ‌నం' ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ రెండో సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఆడియో విడుద‌ల కాక‌ముందు హీరో స్టేజ్ ఎక్కి పాడ‌టం అనేది వేడుక‌కు వ‌చ్చిన ప్ర‌ముఖుల‌ను అల‌రించింది.