Akbaruddin Owaisi: తెలంగాణ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన అక్బరుద్దీన్ ఒవైసీ

  • IndiaGlitz, [Saturday,December 09 2023]

తెలంగాణలో నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభాకానున్నాయి. నాలుగురోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికలైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. గవర్నర్ తమిళిసై ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ జారీ చేశారు. ముందుగా ఎమ్మెల్యేల ప్రమాణం.. తర్వాత స్పీకర్ ఎన్నిక జరగనుంది. అనంతరం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. తదుపరి గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ జరగనుంది.

శాసనసభ ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం అక్బరుద్దీన్ కు గవర్నర్, సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణస్వీకారం అనంతరం అక్బరుద్దీన్ అసెంబ్లీలో కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించనున్నారు. ఎమ్మెల్యేల ప్రమాణం తర్వాత శనివారం సాయంత్రం స్పీకర్ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది. ఆదివారం స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఇప్పటికే స్పీకర్‌గా వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఎంపికయ్యారు.

కాగా కాంగ్రెస్‌కు 64 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా.. మిత్రపక్షమైన సీపీఐకి ఒక స్థానం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి 39, బీజేపీకి 8, ఎంఐఎం పార్టీకి 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపిక లాంఛనమే కానుంది. అయితే డిప్యూటీ స్పీకర్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. స్పీకర్ ఎన్నిక జరిగే వరకు అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తారు.

More News

Bigg Boss Telugu 7: శోభాపై శివన్న చిందులు, అమర్‌పైనా ఫైర్

బిగ్‌బాస్ 7 తెలుగు తుది అంకానికి చేరుకుంది. మరికొద్దిరోజుల్లో సీజన్ ముగియనుంది. ప్రస్తుతం హౌస్‌లో ఓటు అప్పీల్ టాస్క్‌లు నడుస్తున్నాయి. అయితే అమర్‌దీప్ వ్యవహారశైలి ఎందుకో గాడి తప్పింది.

CM Jagan:ప్రతి రైతునూ ఆదుకుంటాం... సీఎం జగన్ భరోసా..

తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన తిరుపతి, బాపట్ల జిల్లాల్లో సీఎం జగన్ పర్యటించారు. ప్రత్యేక హెలికాఫ్టర్‌లో

YS Jagan: నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం తీపికబురు

ఏపీలో నిరుద్యోగులకు సీఎం జగన్ ప్రభుత్వం వరుస తీపికబురులు అందిస్తుంది. ఉద్యోగ జాతరకు శ్రీకారం చుట్టింది. ఒక్క రోజు వ్యవధిలోనే గ్రూప్-2, గ్రూప్‌-1 నోటిఫికేషన్ విడుదల చేసి సువర్ణాధ్యాయం లిఖించింది.

Women Bus Travel Free:మహిళలకు శుభవార్త.. రేపటి నుంచే బస్సుల్లో ఉచిత ప్రయాణం..

తెలంగాణలో మహిళలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రేపు(శనివారం) మధ్యాహ్నం 2గంటల నుంచి రాష్ట్రంలో బాలికలు,

నిరుద్యోగులకు మరో శుభవార్త.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..

ఏపీలో వరుసగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇప్పటికే గ్రూప్‌-2 నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ(APPSC)..