అజిత్ పూర్తి చేసేశాడు.. 

  • IndiaGlitz, [Thursday,April 04 2019]

త‌మిళ స్టార్ హీరో అజిత్ డిసెంబ‌ర్‌లో బాలీవుడ్ చిత్రం 'పింక్‌' రీమేక్ చిత్రీక‌ర‌ణ‌ను స్టార్ట్ చేశాడు. ఖాకి ఫేమ్ హెచ్‌.వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో, బోనీ క‌పూర్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను కేవ‌లం 40 రోజుల్లోనే చిత్రీక‌రించారు. 'నెర్‌కొండ పార్వ్యై పేరుతో సినిమా త‌మిళంలో తెర‌కెక్కుతోంది. అజిత్ కెరీర్‌లోనే అతి త్వ‌ర‌గా పూర్త‌యిన చిత్రాల్లో ఈ చిత్ర‌మొక‌టి. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఆగ‌స్ట్ 10న విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు. శ్ర‌ద్ధా శ్రీనాథ్, అభిరామి, ఆండ్రియా తరియంగ్‌లు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. బాలీవుడ్‌లో అమితాబ్ పోషించిన లాయ‌ర్ పాత్ర‌ను త‌మిళంలో అజిత్ పోషించారు. అజిత్ స‌ర‌స‌న విద్యాబాల‌న్ న‌టించారు. సినిమాను ఎక్కువ భాగం హైద‌రాబాద్‌లోనే చిత్రీక‌రించారు.

More News

రెండేళ్ల త‌ర్వాత‌... 

తెలుగులో హీరోయిన్‌గా త‌న కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకుంటున్న హీరోయిన్ ఈషారెబ్బాపై కోలీవుడ్ తంబీలు కూడా మ‌న‌సు ప‌డ్డారు.

ఎమోష‌న‌ల్ ట్వీట్‌..

ఏడాది కాలంగా లండ‌న్‌లో న్యూరో ఎండోక్రైన్‌ ట్యూమర్‌కి చికిత్స తీసుకుంటున్న బాలీవుడ్ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్ ముంబై చేరుకున్నారు.

'96' అడ్డంకులు క్లియ‌ర్‌...

త‌మిళ చిత్రం `96`ను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి, త్రిష న‌టించిన ఈ చిత్రంలో తెలుగులో శ‌ర్వానంద్‌, స‌మంత న‌టిస్తున్నారు.

చిరు విరామం...

మెగాస్టార్ చిరంజీవి త‌న 151వ చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి` షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. కాస్త విరామం తీసుకుని భార్య సురేఖ‌తో క‌లిసి జ‌పాన్ వెళ్లారు.

పాక్‌కు చుక్కలు చూపించిన భారత్ యంగ్ లేడీ!

టైటిల్ చూడగానే ఇదేంటి మొన్నటి దాకా అభినందన్.. ఇప్పుడు ఈ యంగ్ లేడీ ఎవరబాబ్బా అని ఆశ్చర్యపోతున్నారా..?