29న 'అజ్ఞాత‌వాసి' సెన్సార్‌?

  • IndiaGlitz, [Monday,December 18 2017]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఏస్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం అజ్ఞాత‌వాసి. జ‌ల్సా, అత్తారింటికి దారేది వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ త‌రువాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో.. ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. దానికి తోడు ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్‌కి ప‌వ‌న్ ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

అనిరుధ్ సంగీతంలో రూపొందిన పాట‌ల‌ను రేపు హైద‌రాబాద్‌లో విడుద‌ల చేయ‌నున్నారు. కాగా, ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు ఈ నెల 29న జ‌రుగనున్నాయ‌ని టాలీవుడ్‌లో క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా న‌టించిన ఈ చిత్రంలో కుష్బూ, బొమ‌న్ ఇరాని, ముర‌ళి శ‌ర్మ‌, రావు ర‌మేష్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. సీనియ‌ర్ క‌థానాయ‌కుడు వెంక‌టేష్‌.. ఓ అతిథి పాత్ర‌లో త‌ళుక్కున మెర‌వ‌నున్నార‌ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. కాగా, జ‌న‌వ‌రి 10న సంక్రాంతి కానుక‌గా ఈ సినిమా తెర‌పైకి రానుంది.

More News

ర‌వితేజ హీరోయిన్ ఎవ‌రో..

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ క‌థానాయ‌కుడిగా యువ ద‌ర్శ‌కుడు కళ్యాణ్ కృష్ణ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కనున్న సంగ‌తి తెలిసిందే. రామ్ తాళ్లూరి నిర్మించ‌నున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

రామ్‌చ‌ర‌ణ్ విల‌న్ ద‌ర్శ‌కుడు కాబోతున్నాడు

అర‌వింద్ స్వామి.. పేరుకి త‌మిళ చిత్రాల క‌థానాయ‌కుడు అయినా.. తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా ఆయ‌న సుప‌రిచితుడే. రోజా, బొంబాయి త‌దిత‌ర అనువాద చిత్రాల‌తో తెలుగు వారికి ద‌గ్గ‌రైన అర‌వింద్‌.. మౌనం అనే స్ట్ర‌యిట్ తెలుగు సినిమా కూడా చేశారు. కొంత కాలం పాటు సినిమాల‌కు దూరంగా ఉన్న అర‌వింద్‌.. క‌డ‌లి సినిమాతో తిరిగి తెర‌పైకి వ‌చ్చారు.

బ‌న్ని కొత్త అవ‌తారం

క‌థానాయ‌కుడుగా అల్లు అర్జున్ స్థాయి ఏమిటో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న బ‌న్ని.. ప్ర‌స్తుతం నా పేరు సూర్య సినిమా చేస్తున్నారు. ర‌చ‌యిత వక్కంతం వంశీ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేస్తున్నారు.

నాని కూడా చేరుతాడా?

దిల్ రాజు.. స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన ప్రొడ్యూస‌ర్ పేరిది. కొత్త ద‌ర్శ‌కుల‌తో ఎక్కువ విజ‌యాల‌ను అందుకున్న వైనం రాజు సొంతం. ఇదిలా ఉంటే.. దిల్ రాజు ఈ సంవ‌త్స‌రం ఏకంగా ఆరు చిత్రాల‌ను నిర్మించి వార్త‌ల్లోకెక్కారు.

జనవరిలో విడుదలకు సిద్ధమైన 'శరభ'

ఏ.కె.ఎస్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై ఆకాష్ కుమార్ ను హీరోగా పరిచయం చేస్తూ ఎన్.నరసింహారావు తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ థ్రిల్లర్ 'శరభ'.