అజ్ఞాత‌వాసికి స్ఫూర్తి ఆ పుస్త‌క‌మేనా?

  • IndiaGlitz, [Sunday,December 17 2017]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న 25వ చిత్రం అజ్ఞాత‌వాసి. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. శ‌నివారం విడుద‌ల చేసిన ఈ చిత్రం టీజ‌ర్‌కి ప‌వ‌న్ అభిమానుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. జ‌న‌వ‌రి 10న సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానున్న ఈ చిత్రంపై ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వినిపిస్తోంది.

అదేమిటంటే.. లార్గో వించ్ అనే బెల్గేయిన్ కామిక్ బుక్ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కింద‌ట‌. ఇదే పుస్త‌కం ఆధారంగా అదే టైటిల్‌తో ఓ ఫ్రెంచ్ మూవీ 2008లో వ‌చ్చింది. మ‌ళ్లీ ప‌దేళ్ల త‌రువాత అదే పుస్త‌కం ఆధారంగా తెలుగులో సినిమా రానుండ‌డం విశేషం. అయితే.. ఈ వార్త‌ల్లో నిజ‌ముందో సినిమా విడుద‌ల‌య్యాకే తెలుస్తుంది.

ఒంట‌రి పోరాటం చిత్రం ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంద‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. ఇప్పుడేమో లార్గో వించ్ కామిక్ బుక్ పేరు వినిపిస్తోంది. కాగా, ఈ నెల 19న అజ్ఞాత‌వాసి ఆడియో కానుంది. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ఈ చిత్రానికి స్వ‌రాలు అందించారు.

More News

ఈ వారంలోనే జై సింహా టీజ‌ర్‌

న‌ట‌సింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం జై సింహా. ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో న‌య‌న‌తార, హ‌రి ప్రియ‌, న‌టాషా దోషి క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

'ఎంసీఏ'తో ఈ ఏడాది మా బ్యాన‌ర్‌లో డ‌బుల్ హ్యాట్రిక్ కొడుతున్నాం - దిల్‌రాజు

డ‌బుల్ హ్యాట్రిక్ హీరో.. నేచుర‌ల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందిన సినిమా 'ఎం.సి.ఎ'. సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించింది.

దుబాయ్ లో సాక్ష్యం షూటింగ్

టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీవాస్ - యంగ్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా "సాక్ష్యం" అనే డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తున్నారు.

అంధుడిగా ఆది పినిశెట్టి?

11 ఏళ్ల క్రితం విడుద‌లైన ఒక విచిత్రంతో క‌థానాయ‌కుడిగా తొలి అడుగులు వేశాడు ఆది పినిశెట్టి. ఆ చిత్రం ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో.. త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌య‌త్నాలు చేశాడు.

'అజ్ఞాతవాసి' టీజర్ వచ్చేసింది...

ఎప్పుడెప్పుడా అని పవన్ కల్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్న 'అజ్ఞాతవాసి' టీజర్ వచ్చేసింది.