మళ్లీ టాక్స్‌లో వ‌రుణ్ తేజ్ మూవీ!!

  • IndiaGlitz, [Tuesday,August 25 2020]

యువ క‌థానాయ‌కుడు వ‌రుణ్ తేజ్‌, 'అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు' ఫేమ్ సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారని కొన్ని నెల‌లు ముందు వార్త‌లు వినిపించాయి. వ‌రుణ్ తేజ్ బాక్సర్‌గా న‌టిస్తోన్న తాజా మూవీ ప్లేస్‌లో ఈ సినిమా తెర‌కెక్కాల్సి ఉంది. చాలా రోజులు పాటు ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను కూడా జ‌రుపుకుంది. అయితే ఎందుక‌నో ఈ సినిమాను కాద‌ని వ‌రుణ్ తేజ్ కిర‌ణ్ కొర్ర‌పాటి సినిమాను లైన్‌లోకి తెచ్చారు. అయితే ఇప్పుడు వ‌రుణ్ త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్‌గా సాగ‌ర్ చంద్ర సినిమా చేయ‌బోతున్నారంటూ సినీ వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

హీరో వ‌రుణ్ తేజ్‌తో 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌లో రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఆగిన వ‌రుణ్ తేజ్, కిర‌ణ్ కొర్ర‌పాటి సినిమా షూటింగ్ పూర్తికాగానే ఈ సినిమా ట్రాక్ ఎక్క‌నుంద‌ట‌. నిజానికి ఇటీవ‌ల అయ్య‌ప్ప‌నుమ్ కోశియుమ్ సినిమా రీమేక్‌ను సాగ‌ర్ చంద్ర డైరెక్ట్ చేస్తార‌ని కూడా వార్త‌లు వినిపించాయి. మ‌ళ్లీ ఇప్పుడు వ‌రుణ్ సినిమా సాగ‌ర్ చంద్ర రీ స్టార్ట్ చేస్తున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.

More News

ఆలియా త‌ప్పుకోలేదు... అయితే!!

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భ‌ట్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’ సినిమాలో

చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లి పీటలెక్కనున్న శర్వానంద్!

వైవిధ్యభరితమైన కథను ఎంచుకుంటూ ప్రతి సినిమానూ సక్సెస్ బాట పట్టించుకోవడంలో టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ దిట్ట.

ట్రంప్ ప్రభుత్వం విధించిన నిషేధంపై కోర్టును ఆశ్రయించిన టిక్‌టాక్..

అమెరికా.. సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌ సంస్థ నిర్వాహకుల మధ్య వివాదం ముదురుతోంది. సోమవారం టిక్‌టాక్ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

చైత‌న్య‌కు త‌ప్ప‌డం లేదా!!

హీరోలు కొన్ని ప్రాజెక్టులు చేయ‌కూడ‌ద‌ని అనుకున్నా కూడా.. డైరెక్ట‌ర్, స్క్రీన్‌ప్లే న‌చ్చితే చేయాల్సి వ‌స్తుంది.

నిర్మాత‌కు డ‌బ్బులు వెన‌క్కిచ్చేసిన గోపీచంద్‌?

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీంచ‌ద్ ఇప్పుడు సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్‌’ రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.