రెండేళ్ల తర్వాత...
- IndiaGlitz, [Thursday,April 04 2019]
తెలుగులో హీరోయిన్గా తన కంటూ ప్రత్యేకతను సంపాదించుకుంటున్న హీరోయిన్ ఈషారెబ్బాపై కోలీవుడ్ తంబీలు కూడా మనసు పడ్డారు. దర్శకుడు ఎలిల్, నటుడు, సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో హీరోయిన్గా ఈషారెబ్బాను ఎంపిక చేసుకున్నారు. అయితే ఇది వరకే 2016లో ఈషా రెబ్బా 'ఓయ్' అనే తమిళ చిత్రంలో నటించారు. రెండేళ్ల తర్వాత ఈషా రెబ్బా తమిళంలో చే్స్తున్న సినిమా ఇది. కామెడీ ఎంటర్టైనర్. తెలుగులో గుర్తింపు సంపాదించుకున్నట్లే తమిళంలో కూడా ఈషారెబ్బాకు పేరొస్తే చేతినిండా ఆఫర్లకు కొదవే ఉండదు.