అప్పుడు శంక‌ర్‌.. ఇప్పుడు పా.రంజిత్‌

  • IndiaGlitz, [Wednesday,June 06 2018]

ఎంత ఎదిగినా ఒదిగి ఉండమంటారు పెద్దలు. ఈ లక్షణాన్ని అలాగే పుణికి పుచ్చుకున్న నటుడు రజనీ కాంత్. అందుకే ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ సూపర్ స్టార్‌ను.. కనీసం ఒక్కసారైనా డైరెక్ట్ చేయాలని అనుకుంటూ ఉంటారు దర్శకులు. అటువంటిది వరుసగా రెండుసార్లు రజనీని డైరెక్ట్ చేసే అవకాశం వస్తే.. అటువంటి గోల్డెన్ ఛాన్స్ ఇటీవ‌ల కాలంలో ఇద్దరు దర్శకులకు మాత్రమే దక్కింది. ఆ వివరాల్లోకి వెళితే.. రెండుసార్లు వరుసగా రజనీ కాంత్ సినిమాలను డైరెక్ట్ చేసిన ద‌ర్శ‌కుడు శంకర్. 2007లో విడుద‌లైన ‘శివాజీ’ సినిమా కోసం తొలిసారి రజనీకాంత్‌ను డైరెక్ట్ చేసారు శంకర్.

అనంత‌రం రజనీతో త‌న తదుపరి చిత్రం ‘రోబో’ను తెర‌కెక్కించారు శంక‌ర్‌. కాగా.. ఇప్పుడు శంకర్ సరసన మరో దర్శకుడు చేరారు. ఆయ‌నే.. పా.రంజిత్. ‘కబాలి’ సినిమాతో తొలిసారి ర‌జ‌నీని దర్శకత్వం చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు పా.రంజిత్. అంతేగాకుండా, ‘కబాలి’ తర్వాత వెనువెంట‌నే రజనీ కాంత్ కాంబినేష‌న్‌లోనే ‘కాలా’ చేశారు. మరి రజనీ, శంకర్ కలయికలో వచ్చిన సెకెండ్ ఫిల్మ్‌ ‘రోబో’ లాగే.. రజనీ, పా.రంజిత్ కాంబినేషన్‌లో వస్తున్న ‘కాలా’ కూడా సంచలనాన్ని సృష్టిస్తుందేమో చూడాలి. జూన్ 7న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

More News

ద‌స‌రా సంద‌డంతా సునీల్ దేనా?

‘నువ్వేకావాలి’తో కమెడియన్‌గా పరిచయమై.. తక్కువ వ్యవధిలోనే తెలుగులో టాప్ కమెడియన్‌గా ఎదిగారు సునీల్‌.

'చినబాబు'కి బాలు డ‌బ్బింగ్ చెప్పారా?

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం.. పరిచయం అక్కరలేని పేరు. భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని దాదాపు అన్ని భాషల్లోనూ పాట‌లు పాడి..

సూర్య‌.. రెండేళ్ళు బిజీ

'గ‌జిని' చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన త‌మిళ క‌థానాయ‌కుడు సూర్య‌.

దటీజ్ మహాలక్ష్మిగా రాబోతున్న హీరోయిన్ తమన్నా

క్వీన్ రీమేక్ సెట్స్ లో  హీరోయిన్ పరుల్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. కన్నడ, తమిళ్, మలయాళం, తెలుగు భాషల్లో ఒకేసారి  తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ మైసూర్ లో  శరవేగంగా జరుగుతోంది.

'పంతం' టీజ‌ర్‌కి అద్భుత‌మైన స్పంద‌న‌

శ్రీ స‌త్య సాయి ఆర్ట్స్ ప‌తాకంపై కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తోన్న చిత్రం `పంతం`. గోపీచంద్ న‌టిస్తోన్న 25వ సినిమా ఇది.