అప్పుడు నిత్యా..ఇప్పుడు మేఘా..

  • IndiaGlitz, [Monday,August 14 2017]

ఒకే హీరోయిన్‌తో రెండు వ‌రుస సినిమాలు చేయ‌డం నితిన్‌కి సెంటిమెంట్‌గా మార‌నుందా? అవున‌నే అనిపిస్తోంది అత‌ని తీరు చూస్తోంటే. త‌న కెరీర్ గాడి త‌ప్పిన‌ప్పుడు ఇష్క్ చిత్ర విజ‌యం నితిన్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. క‌ట్ చేస్తే.. త‌న త‌దుప‌రి సినిమాలో కూడా ఇష్క్ హీరోయిన్ నిత్యా మీన‌న్‌నే క‌థానాయిక‌గా ఎంచుకుని అప్ప‌ట్లో మ‌రో హిట్ కొట్టాడు నితిన్‌.

నాలుగు సంవ‌త్స‌రాల‌ త‌రువాత మ‌ళ్లీ మ‌రో హీరోయిన్‌ని ఇలా రెండు వ‌రుస చిత్రాల కోసం ఎంచుకున్నాడీ యంగ్ హీరో. ఆ హీరోయినే మేఘా ఆకాష్‌. విశేష‌మేమిటంటే.. నిత్యా త‌న‌కి హిట్ పెయిర్ అనిపించాకే రెండో అవ‌కాశం ఇస్తే.. మేఘా విష‌యంలో తొలి చిత్రం రిలీజ్‌కి ముందే సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన తొలి చిత్రం లై ఇటీవ‌లే విడుద‌లై మిక్స్‌డ్ టాక్‌తో థియేట‌ర్ల‌లో న‌డుస్తోంది. రెండో సినిమా ఆల్రెడీ సెట్స్‌పై ఉంది. నిత్యాలా అంత‌గా క‌లిసిరాక‌పోయినా.. మేఘాకి నితిన్‌తో రెండో అవ‌కాశం దొర‌క‌డం అదృష్ట‌మే. నితిన్‌, మేఘాల కాంబినేష‌న్‌లో రానున్న ఆ రెండో చిత్రాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ నిర్మిస్తుండ‌డం విశేషం. కృష్ణ చైత‌న్య ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు.

More News

తారక్ సినిమాతో హ్యాట్రిక్ కొడుతుందా?

చేసింది రెండు సినిమాలే.కానీ ఆ రెండు సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది కేరళ కుట్టి నివేదా థామస్.

15వ 'సంతోషం' వార్షికోత్సవాలు..'సంతోషం' సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డుల వేడుక ఫంక్షన్!

'సంతోషం' 15వ వార్షికోత్సవాలు...సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం శనివారం సాయంత్రం హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా

రేపే ప్రారంభం కానున్న మహేష్ కొత్త సినిమా

సూపర్ స్టార్ మహేష్ ఇప్పుడు స్పైడర్ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకున్నాడు.

రానాకి గుర్తుండిపోయేలా..

ఏడేళ్ల క్రితం 'లీడర్ ' తో కథానాయకుడిగా తెరంగేట్రం చేసిన దగ్గుబాటి వారి వారసుడు రానాకి..

ప్రభాస్ అతిథిగా...

బాహుబలితో నేషనల్ స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో ప్రభాస్.