మొన్న మ‌హేష్‌...నిన్న శ్రుతి..నేడు ప్ర‌కాష్ రాజ్...

  • IndiaGlitz, [Monday,September 07 2015]

ఏ ముహుర్తాన శ్రీమంతుడు క‌థ కొర‌టాల మైండ్ లోకి వ‌చ్చిందో కానీ...ఆత‌ర్వాత శ్రీమంతుడు తెర‌పైకి రావ‌డం బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డం తెలిసిందే. అలాగే...అన్ని సినిమాలు ఒకేలా ఉండ‌వు. కొన్ని సినిమాలు అన్ని సినిమాల్లా...అలా వచ్చి ఇలా వెళ్లిపోవు. థియేట‌ర్ నుంచి సినిమా వెళ్ళిపోయినా దాని ప్ర‌భావం మాత్రం చాలా ఉంటుంది. అలా ప్ర‌భావం చూపించిన చిత్ర‌మే శ్రీమంతుడు. ఈ సినిమాలో మ‌హేష్ ఓ ఊరిని ద‌త్త‌త తీసుకుని ఊరి రూపురేఖ‌లే మార్చేస్తాడు. ఆ పాత్ర‌ను రీల్ లైఫ్ లోనే కాదు...రియ‌ల్ లైఫ్ లో కూడా చేస్తాన‌ని చెప్పి చూపించాడు.

త‌న సొంతూరు బుర్రిపాలెం, అలాగే తెలంగాణ‌లోని మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలోని వెన‌క‌బ‌డిన‌ ఊరును ద‌త్త‌త తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. ఇక శ్రీమంతుడు హీరోయిన్ శ్రుతిహాస‌న్ కూడా త‌మిళ‌నాడులో వెన‌క‌బ‌డిన‌ ఓ గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుంటుంది. తాజాగా విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ తెలంగాణ‌లోని మహ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలోని కొండారెడ్డి ప‌ల్లెను ద‌త్త‌త తీసుకుంటున్నారు. ఈ విష‌యాన్ని తెలంగాణ ఐ.టి. మినిస్ట‌ర్ కె.టి.ఆర్ ను క‌లిసి ప్ర‌కాష్ రాజ్ తెలియ‌చేసారు.

త్వ‌ర‌లోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని అనంత‌పూర్ జిల్లాలోని వెన‌క‌బ‌డిన గ్రామాన్నికూడా ద‌త్త‌త తీసుకుంటారట‌. ఏది ఏమైనా....మొన్న మ‌హేష్‌...నిన్న శ్రుతి...నేడు ప్ర‌కాష్ రాజ్...ఇలా ఒక‌రి త‌ర్వాత ఒక‌రు ముందుకు వ‌చ్చి వెన‌క‌బ‌డిన గ్రామాల్నిద‌త్త‌త తీసుకోవ‌డం మంచి ప‌రిణామం.