అప్పుడు కృష్ణ‌, ఇ.వి.వి- ఇప్పుడు మ‌హేష్‌, అల్లరి న‌రేష్‌

  • IndiaGlitz, [Wednesday,April 25 2018]

కొన్ని కొన్ని విష‌యాలు యాదృచ్ఛికంగా జ‌రిగినా విన‌డానికి ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. అలాంటి ఓ విష‌య‌మే కృష్ణ‌, మ‌హేష్ బాబు విష‌యంలో చోటు చేసుకోనుంది. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. సూప‌ర్ స్టార్ కృష్ణ ఇప్ప‌టివ‌ర‌కు 350కి పైగా చిత్రాల‌లో న‌టించిన విష‌యం తెలిసిందే.

100వ చిత్రంగా అల్లూరి సీతారామరాజు, 200వ చిత్రంగా ఈనాడు, 300వ చిత్రంగా తెలుగు వీర లేవ‌రా చేసి త‌న అభిరుచి చాటుకున్నారు కృష్ణ‌. ఈ మూడు మైల్ స్టోన్ మూవీస్‌లో తెలుగువీర లేవ‌రా ఆశించిన విజ‌యం అందుకోలేక‌పోయింది. ఈ సినిమాకి.. అప్ప‌ట్లో వ‌రుస విజ‌యాల‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఇ.వి.వి.స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఫ‌లితం సంగ‌తి ప‌క్క‌న‌పెడితే.. కృష్ణ 300వ చిత్ర ద‌ర్శ‌కుడిగా ఇ.వి.వికి ప్ర‌త్యేక స్థాన‌ముంది. క‌ట్ చేస్తే.. ప్ర‌స్తుతం కృష్ణ వార‌సుడు మ‌హేష్ బాబు న‌టిస్తున్న 25వ చిత్రంలో ఓ ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టించే అవ‌కాశం ఇ.వి.వి.త‌న‌యుడు అల్ల‌రి న‌రేష్‌ను వ‌రించింది.

నాడు కృష్ణ మైల్ స్టోన్ సినిమాకి దర్శ‌క‌త్వం వ‌హించే ఛాన్స్ ఇ.వి.వి కి ద‌క్కితే.. ఇప్పుడు మ‌హేష్ మైల్ స్టోన్ మూవీలో న‌టించే ఆఫ‌ర్ ఇ.వి.వి.త‌న‌యుడు అల్ల‌రి న‌రేష్ ద‌క్క‌డం విశేష‌మ‌నే చెప్పాలి. 

More News

బాల‌య్యతో వ‌ర్క‌వుట్ కాలేదు.. మ‌రి సుధీర్ బాబుకి?

వైవిధ్య‌మైన చిత్రాల‌కు చిరునామాగా నిలిచిన నిర్మాణ సంస్థ‌ల్లో శ్రీ‌దేవి మూవీస్ ఒక‌టి. ఆదిత్య 369, వంశానికొక్క‌డు వంటి విజ‌యంత‌మైన చిత్రాల‌ను నిర్మించిన ఈ సంస్థ అధినేత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్‌..

క‌ల్యాణ్ రామ్ హీరోగా ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్, నివేదా థామ‌స్‌, షాలిని పాండే హీరో హీరోయిన్లుగా

వారం గ్యాప్‌లో రెండు సోల్జ‌ర్ చిత్రాలు

దేశం కోసం ప్రాణత్యాగం చేయ‌డానికి కూడా వెనుకాడ‌ని ఆర్మీ ఆఫీస‌ర్ల క‌థ‌ల‌తో గ‌తంలో ఎన్నో సినిమాలు వ‌చ్చాయి.

ర‌వితేజ 'డిస్కోరాజా'

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం నేల టిక్కెట్టు సినిమాతో మే 24న ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. రామ్ తాళ్లూరి నిర్మాణంలో క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా చేస్తున్నాడు.

నాగ‌చైత‌న్య‌, స‌మంత‌..నో సీన్స్‌?

నాగ‌చైత‌న్య‌, స‌మంత.. ఆన్ ద‌ స్క్రీన్ మాత్ర‌మే కాదు.. ఆఫ్ ద‌ స్క్రీన్ కూడా మంచి జోడీ అనిపించుకున్నారు.