Komatireddy Venkat Reddy:జూన్ 4 తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం: కోమటిరెడ్డి

  • IndiaGlitz, [Thursday,May 23 2024]

లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. తమ కుటుంబసభ్యురాలైన కవిత జైలుకు వెళ్లిందని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయామనే ఫ్రస్టేషన్‌లో కేసీఆర్, కేటీఆర్ ఉన్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మాటలు అసహ్యం గా ఉన్నాయని.. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించినందుకా.. 30 వేల ఉధ్యోగ నియామకాలు చేపట్టినందుకా.. రేవంత్ రెడ్డిని కేటీఆర్ తిట్టేది అని మండిపడ్డారు. వైఎస్సార్ తరహాలో రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని గుర్తుచేశారు.

రేవంత్ రెడ్డికి భయపడి కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎల్పీ పదవి కేటీఆర్‌కు ఇస్తే హరీష్ రావు కొత్త దుకాణం పెట్టే ఆలోచనలో ఉన్నారని ఆరోపించారు. ఇకనైనా కేసీఆర్ కుటుంబం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు మానుకుని.. కవిత బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే బెటర్ అని సలహా ఇచ్చారు. కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలు తలెత్తుకోలేకపోతున్నారని.. ఇతర రాష్ట్రాలకు వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్లమెంట్ ఎన్నికల్లో 12 ఎంపీ సీట్లకు తగ్గకుండా గెలుచుకుంటామని.. బీఆర్ఎస్ పార్టీకి ఒక సీటు కూడా రాదని.. కనీసం రెండు, మూడు చోట్ల డిపాజిట్ వస్తే ఎక్కువ అని జోస్యం చెప్పారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందన్నారు. పేదలకు సన్న బియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పామన్నారు. అంతేకానీ దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వమని తాము ఎక్కడా చెప్పలేదన్నారు. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మీద కేసులు ఉన్నాయని అంటున్న కేటీఆర్.. కవిత కేసు గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.

More News

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి తీవ్ర అస్వస్థత.. ఆందోళనలో కుటుంబసభ్యులు..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుడివాడలోని తన స్వగృహంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతూ అకస్మాత్తుగా సోఫాలో

TGSRTC:టీజీఎస్ఆర్టీసీ లోగోపై ప్రభుత్వం కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్ర సంక్షిప్త పదం టీఎస్‌ నుంచి టీజీగా మారిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తికి అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవలే టీజీ పేరును

Ilaiyaraaja:ఇళయరాజా తీవ్ర ఆగ్రహం.. 'మంజుమ్మల్ బాయ్స్' యూనిట్‌కి నోటీసులు

ఇళయరాజా సంగీత ప్రియులకు ఓ వ్యసనం లాంటి వారు. ముఖ్యంగా 80, 90 దశకాల్లో తెలుగు, తమిళ్ సినిమాలకు ఎన్నో గొప్ప పాటలకు సంగీతం ఇచ్చారు.

Pinnelli:పిన్నెల్లి కోసం పోలీసులు ముమ్మర వేట.. ఈసీకి డీజీపీ నివేదిక..

పోలింగ్ ముగిసినా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఘర్షణలు మాత్రం ఇంకా తగ్గడం లేదు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయ్ గేట్‌ పోలింగ్ కేంద్రంలో

Bharatiyadu 2:‘భార‌తీయుడు 2’... నుంచి లిరికల్ సాంగ్ ‘శౌర..’ రిలీజ్

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో