18 ఏళ్ళ త‌రువాత..

  • IndiaGlitz, [Tuesday,May 22 2018]

అక్కినేని నాగార్జున నటించిన సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా.. ఆయన నటించిన సినిమాల్లో సింహభాగం మ్యూజికల్ హిట్స్ అనిపించుకున్నాయి. అలాగే.. వైజయంతి మూవీస్ పతాకంపై ప‌లు సినిమాలను నిర్మించిన నిర్మాత సి.అశ్వనీదత్‌కు కూడా మంచి మ్యూజిక్ సెన్స్ ఉందని ఆయన సినిమాలను చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఇక “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ గురించి వేరేగా చెప్పనక్కరలేదు. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎన్నో మ్యూజికల్ హిట్స్‌ను శ్రోతలకు అందించారు. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో ఇప్పటికే ‘రావోయి చందమామ’, ‘ఆజాద్’ లాంటి సినిమాలు వచ్చాయి.

అయితే.. వీటిలో ‘ఆజాద్’ (29 సెప్టెంబర్‌ 2000) సినిమా విజ‌యాన్ని అందుకుంది. మళ్ళీ 18 సంవత్సరాల తర్వాత ఇదే సెప్టెంబర్ నెలలో ఈ కలయికలో మరో సినిమా రాబోతోంది. ఆ వివరాల్లోకి వెళితే.. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్‌లో నాగ్, నాని హీరోలుగా మల్టీస్టారర్ మూవీ ఒకటి తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ స్వరాలను సమకూరుస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుంది. మరి గత చిత్రం ‘ఆజాద్’ లాగే ఈ సినిమా కూడా హిట్‌ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి.

More News

రెండు నెల‌ల పాటు యు.ఎస్‌లో ర‌వితేజ బిజీ

ఏడాదికి కనీసం మూడు సినిమాలైనా విడుదలయ్యేట్టు ప్లాన్ చేసుకుంటున్నారు రవితేజ.

దిల్ రాజు, భూమా అఖిలప్రియ చేతుల మీదుగా 'బంగారి బాలరాజు' పాటలు విడుదల

బంగారి బాలరాజు చిత్రం ఆడియోలోని మొదటి మూడు పాటలను నందమూరి కళ్యాణ్ రామ్, నిర్మాతలు అశ్వనీదత్, అనిల్ సుంకర విడుదల చేసిన సంగతి తెలిసిందే.

డ్రైవర్ రాముడు టీజర్ ను విడుదల చేసిన సుధీర్ బాబు

నవ్వుల వీరుడు షకలక శంకర్ హీరో గా  రాజ్ స‌త్య దర్శకత్వంలో

ఒకే నెలలో మూడు సినిమాల‌తో.. 

‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ లాంటి క్లాస్ చిత్రంతో తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మై.

బాలయ్య కోసం మరోసారి.. పరుచూరి

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.