‘వీరమల్లు’ షూటింగ్‌లో ఆదిత్య మీనన్‌కు గాయం.. చెన్నైకి తరలింపు

  • IndiaGlitz, [Wednesday,March 31 2021]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం నటిస్తున్న భారీ పిరియాడికల్, పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ చిత్రం టాలెంటెడ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. 14వ శతాబ్దానికి చెందిన కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. పవన్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. ఔరంగజేబు కాలం నాటి సెట్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. పిరియాడిక్ మూవీలో పవన్ నటించడం ఇదే తొలిసారి అయితే.. పవన్ ఒక వజ్రాల దొంగగా నటించడం మరో ఆసక్తికర విషయం.

ఈ సినిమాలో పవన్‌కు హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తోంది. బాలీవుడ్ సుందరి జాక్వలైన్ ఫెర్నాండేజ్ స్పెషల్ రోల్ లో కనిపించనున్నదని తెలుస్తోంది. ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంవత్సరం అంటే 2022 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఒక అపశృతి తలెత్తింది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు ఆదిత్య మీనన్ నటిస్తున్నారు. కాగా.. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ షూటింగ్‌లో ఆదిత్య మీనన్ షూటింగ్‌లో గాయాల పాలయ్యారు.

ఈ చిత్రంలో వీరమల్లులో గుర్రపు స్వారీ చేస్తున్న ఓ కీలక సన్నివేశాన్ని తెరకెక్కిస్తుండగా అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు అవుతున్నట్టుగా తెలుస్తోంది. గాయం చాలా పెద్దదే అయినట్టు తెలుస్తోంది. వెంటనే చిత్ర యూనిట్ ఆయనను యశోదా హాస్పిటల్‌కి తరలించింది. అక్కడ రెండు రోజులు చికిత్స తీసుకున్న అనంతరం చెన్నై‌లోని ఓ ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే ఆదిత్య మీనన్ ఆరోగ్యం బాగానే ఉన్నట్టుగా వైద్యులు తెలిపారు. ఆదిత్య మీనన్ గతంలో కూడా పవన్‌తో కలిసి ‘అజ్ఞాతవాసి’లో నటించారు.

More News

‘వకీల్‌సాబ్‌’ ట్రైలర్ రికార్డ్.. భారీగా పెరిగిన అంచనాలు

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌,

షూటింగ్‌ను ఆపేసిన మ‌హేశ్ అండ్ టీమ్‌..!

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ లేటెస్ట్ మూవీ ‘స‌ర్కారువారిపాట‌’. ప‌రశురాం ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రీసెంట్‌గానే యూనిట్ దుబాయ్ షెడ్యూల్‌ను షురూ చేసిన సంగ‌తి తెలిసిందే.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి నిధి అగ‌ర్వాల్ ఏమందంటే..?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ లేటెస్ట్‌గా రెండు సినిమాల‌ను పూర్తి చేసే ప‌నిలో బిజి బిజీగా ఉన్నారు. ఇందులో ఓ సినిమా ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’.

హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్న అల్లు శిరీష్!

మెగా హీరో అల్లు శిరీష్ గురించి ఓ వార్త ఇండటస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది. ఇలాంటి గాసిప్స్ ఇండస్ట్రీకేం కొత్త కాదు కానీ..

ప్రియమైన వారి నుంచి ఉంగరం అందిందంటూ రష్మిక పోస్ట్..

నటి రష్మిక తాజాగా ఓ బహుమతి అందుకుంది. అది ఎవరి నుంచి అనేది తెలియదు కానీ ఆ గిఫ్ట్‌ని చూశాక ఆమె ఆనందానికి అవధుల్లేవని తెలుస్తోంది.