close
Choose your channels

హీరోయిన్ సమంతకు .... చాంపియన్స్‌ ఆఫ్‌ ది చేంజ్‌ తెలంగాణ 2021 అవార్డ్

Saturday, February 26, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఓ వైపు క్షణం తీరిక లేకుండా సినిమా షూటింగ్‌లలో పాల్గొంటారు సమంతా. దీనితో పాటు తనను ఇంతటి వారిని చేసిన సమాజానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో సామాజిక కార్యక్రమాలకు కూడా సమయం కేటాయిస్తూ వుంటారామె. ఈ క్రమంలోనే సమంతను ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ తెలంగాణ 2021 అవార్డును సమంత అందుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌ తాజ్‌డెక్కన్‌లో ఇంటరాక్టివ్‌ ఫోరమ్‌ ఆన్‌ ఇండియన్‌ ఎకానమీ (ఐఎఫ్‌ఐఈ) సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సమంతకు అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ బాలకృష్ణన్ హాజరయ్యారు. జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను పెంపొందిస్తూ.. సమాజసేవ, సామాజిక విలువల అభివృద్ధి, పలు రంగాల్లో సేవలు అందించిన వారికి ఈ అవార్డులను అందజేశారు.

సమంతతో పాటు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్, డాక్టర్‌ డీ నాగేశ్వర్‌రెడ్డి, మైహోం గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ జూపల్లి రామేశ్వర్‌రావు, తెలంగాణ ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, తెలంగాణ ఇంచార్జి డీజీపీ అంజనీకుమార్‌, భారత మాజీ క్రికెట్‌ కెప్టెన్‌ అజారుద్దీన్‌, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు, సినీ నటులు మహేశ్‌బాబు, అల్లుఅర్జున్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, జ్యోత్స్న రెడ్డి, సుధారాణి రెడ్డి, శశి జాలిగామ, మనీశ్‌ దోషి, దిరిసాల నరేశ్‌ దరి, డాక్టర్‌ రాజా తంగప్పన్‌ తదితరులకు ఈ అవార్డును అందజేశారు.

ఇకపోతే.. నాగచైతన్యతో విడాకులు .. ఆతర్వాత జరిగిన పరిణామాల నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతోన్న సమంత ప్రస్తుతం కెరీర్‌పై ఫోకస్ పెట్టారు. ఆమె అనేక కొత్త ప్రాజెక్ట్స్‌కి సైన్ చేస్తున్నారు. ఇప్పటికే ఒప్పుకున్న చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమాతో బిజీగా వున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ నిన్న విడుదల చేశారు. మైథలాజికల్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శకుంతలగా సమంత లుక్ అదిరిపోయింది. అలాగే సామ్ హీరోయిన్ గా యశోద టైటిల్ తో మరో పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ కోసం రూ. 3 కోట్లతో ఖరీదైన సెట్స్ నిర్మిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment