శ‌రణ్ కుమార్ కొత్త చిత్రం.. హీరో లుక్‌ పోస్టర్‌ను ఆవిష్క‌రించిన సూప‌ర్‌స్టార్ కృష్ణ

  • IndiaGlitz, [Monday,August 09 2021]

సూపర్‌స్టార్ కృష్ణ‌, విజ‌య‌నిర్మల ఫ్యామిలీ నుంచి శ‌రణ్ కుమార్ హీరోగా ప‌రిచయం అవుతున్న సినిమాలో హీరో లుక్ పోస్ట‌ర్‌ను ఆదివారం సూప‌ర్‌స్టార్ కృష్ణ విడుద‌ల చేశారు. శివ కేశ‌న కుర్తి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెన్నెల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.3గా ఎం.సుధాక‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌హేశ్ పుట్టిన‌రోజు(ఆగ‌స్ట్‌9) సంద‌ర్భంగా ఈ సినిమాలో హీరో లుక్‌ను సూప‌ర్‌స్టార్ కృష్ణ రిలీజ్‌ చేశారు. హీరో త‌ల‌కి చిన్న‌గాయ‌మైన‌ట్లు బ్యాండేజ్ వేసుకుని నిల‌డి ఉంటే పోస్ట‌ర్‌లో జ‌నాలు, రెండు వాహ‌నాలు వెళ్ల‌డం .. ఇవ‌న్నీ సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి.

ఈ సంద‌ర్భంగా...

సూప‌ర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ ‘‘శరణ్ హీరోగా చేస్తోన్న సినిమా హీరో లుక్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇది త‌న‌కు హీరోగా ప‌ర్‌ఫెక్ట్ ల్యాండింగ్ అవుతుంది. శ‌రణ్ యాక్ట‌ర్‌గా చాలా మంచి పేరు తెచ్చుకోవాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

నిర్మాత ఎం.సుధాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘శరణ్‌కుమార్ హీరోగా చేస్తున్న ఈ సినిమా హీరో లుక్ పోస్టర్‌ను మ‌హేశ్‌గారి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సూప‌ర్‌స్టార్ కృష్ణ‌గారు విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. సూప‌ర్‌స్టార్ ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న శ‌ర‌ణ్‌కు ఈ సినిమా క‌చ్చితంగా మంచి బ్రేక్ ఇస్తుంది. అలాగే న‌రేశ్‌గారు, జ‌యసుధ‌గారు, సుధీర్‌బాబుగారు మా టీమ్‌ను ప్ర‌త్యేకంగా అభినందించ‌డం హ్య‌పీగా ఉంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించి మ‌రిన్ని విష‌యాల‌ను తెలియ‌జేస్తాం’’ అన్నారు.

న‌టీన‌టులు: శ‌ర‌ణ్ కుమార్‌

More News

'SR కళ్యాణమండపం' మ్యూజికల్ హిట్ అవడం సంతోషంగా ఉంది - చేతన్ భరద్వాజ్

యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ ఆ పేరు వినగానే "RX 100" చిత్రం లోని పిల్లారా సాంగ్ గుర్తుకు వస్తుంది.

షూటింగ్ పూర్తి చేసుకున్న హన్సిక '105 మినిట్స్'

ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ కధనం తో తెరకెక్కుతోన్న చిత్రం "105 మినిట్స్".

BRO చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన రష్మిక మందన

ఎన్నో హిట్ సినిమాలలో నటించిన హీరో,హీరోయిన్ లు ఈ మధ్య కథకు  ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఆది సాయికుమార్ 'బ్లాక్' టీజ‌ర్ విడుద‌ల‌

మ‌హంకాళీ మూవీస్ బ్యాన‌ర్ పై మ‌హంకాళీ దివాక‌ర్ నిర్మాత‌గా మ్యాచో హీరో ఆది సాయికుమార్,

కీలక పాత్రలో సుహాసిని

సుమంత్‌, నైనా గంగూలీ జంట‌గా టీజీ కీర్తికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రెడ్ సినిమాస్ బ్యాన‌ర్‌పై కె.రాజ‌శేఖ‌ర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘మళ్ళీ మొదలైంది’.